సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో సెలబ్రిటీ వార్త సినీ ప్రేక్షకులను కలచివేస్తుంది. తాజాగా పాపులర్ టీవీ సీరియల్ “సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా” ఫేమ్ నటుడు అరవింద్ ధను కన్నుమూశారు. ఈ మరాఠీ సీరియల్ లో షాలిని తండ్రి పోషించిన అరవింద్.. తన 47ఏళ్ళ వయసులో హఠాన్మరణం చెందిన వార్త టీవీ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
సినీవర్గాల సమాచారం ప్రకారం, అరవింద్ ధను సోమవారం ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. కాసేపటికి బీపీ కారణంగా అసౌకర్యంగా భావించడంతో.. వెంటనే అరవింద్ ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే అరవింద్ పరిస్థితి విషమంగా మారింది. చివరకు బ్రెయిన్ హెమరేజ్ వలన తుదిశ్వాస విడిచారు. ఇక నటుడిగా ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ అనే టీవీ సీరియల్ ద్వారా అరవింద్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఈ సీరియల్ లో అరవింద్ పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర ప్రేక్షకులలో మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో టీవీ సీరియల్స్ లో తన ప్రతిభను కనబరిచిన అరవింద్.. చాలా సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ పాత్రలు పోషించారు. ఇక అరవింద్ ధను.. ‘లేక్ మాఝీ లడ్కీ’, ‘సుఖ్ మ్హంజే నక్కీ కే అస్తా’ మరియు ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్స్ తో పాటు ‘ఏక్ హోతా వాల్యా’ అనే మరాఠీ చిత్రంలో నటించారు.
కెరీర్ లో ఎంతోమంది సీనియర్ నటులతో కలిసి పనిచేశారు అరవింద్. చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ, అతని నటనా నైపుణ్యాలు టీవీ ప్రేక్షకులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. ఇక ఇప్పుడు అరవింద్ ధను ఇక లేరనే వార్త టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపేసింది. ప్రస్తుతం ప్రముఖ నటులతో పాటు అభిమానులు నటుడు అరవింద్ ధను కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
47-year-old Marathi actor #ArvindDhanu dies of brain hemorrhage after falling ill at an event https://t.co/i2B7cc9HgS pic.twitter.com/fPHgyq9xWd
— The Times Of India (@timesofindia) July 26, 2022