సినీ ఇండస్ట్రీలో ఎందరో ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలా టాలీవుడ్ లో అడుగుపెట్టి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరమైపోయిన హీరోయిన్ అన్షు అంబానీ. ఈ బ్యూటీని పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు. కానీ.. మన్మధుడు సినిమాలో ‘మహి’ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ అంటే మాత్రం.. సులభంగా గుర్తుపడతారు ప్రేక్షకులు.
టాలీవుడ్ లో మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో సోనాలి బింద్రే మెయిన్ హీరోయిన్ కాగా అన్షు సెకండ్ హీరోయిన్ గా నటించింది. అన్షు చేసింది చిన్న పాత్రే.. అయినప్పటికీ ప్రేక్షకులకు ఇప్పటికి గుర్తుండిపోయింది. ఆ సినిమా వచ్చి ఇరవైయేళ్లు అయినప్పటికీ, ఇంకా అన్షు ఏమైపోయింది? ఎక్కడుంది? అని ఆరా తీస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇక మన్మధుడు తర్వాత డార్లింగ్ ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అదీగాక ఈ రెండు సినిమాల్లో అమ్మడు చనిపోయే పాత్రలే చేయడం గమనార్హం. అంతే.. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు అన్షు. తమిళంలో జై అని ఒకే ఒక్క సినిమా చేసింది. మరి అవకాశాలు రాలేదా? లేక ఆమెనే కావాలని ఇండస్ట్రీకి దూరమైందా అనేది తెలియదు. కానీ.. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యామిలీతో ప్రత్యక్షమై ట్విస్ట్ ఇచ్చింది.
కెరీర్ పరంగా 3 సినిమాలే చేసిన అన్షు.. అప్పటినుండి లండన్ లోనే సెటిల్ అయిపోయింది. అందులోనూ లండన్ లోనే పుట్టి పెరగడంతో సినిమాల్లోకి అతిథిలా వచ్చి వెళ్ళింది. ఇక 18 ఏళ్ళ వయసులోనే బిజినెస్మేన్ సచిన్ సగ్గార్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం అన్షు లండన్ లో ‘ఇన్స్పిరేషన్ కౌచర్’ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో అన్షు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక అన్షు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త, పిల్లలతో కలిసి ఫోటోలు పోస్ట్ చేస్తోంది. తాజా ఫోటోలు చూస్తుంటే.. అన్షు ఫ్యామిలీతో టర్కీ టూర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మన్మధుడు ఫేమ్ అన్షు ఫ్యామిలీ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.