ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం.. ఈ టీవీ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ కార్తీక దీపం సీరియల్ చూస్తారంటే అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అని అంతా చెబుతుంటారు. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ వచ్చే సమయం అవుతుందా.. తరువాత సీరియల్ లో ఏమవుతుంది అన్న ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. టిఆర్పి రేటింగ్ విషయంలో షోలు, సీరియళ్ల కంటే ఈ సీరియల్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
బుల్లితెరపై టాప్ రేటింగ్తో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతోంది. తెలుగు ప్రేక్షకుల్లో ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా కార్తీకదీపం సీరియల్ చూస్తే బుల్లితెర మహానటి దీప మరణిస్తుందనే హైప్ క్రియేట్ చేశారు. శనివారం నాటి ఎపిసోడ్లో దీప డాక్టర్ బాబు ఒడిలో ప్రాణాలు విడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది నిజమా లేక అసలు నిజం తెలుసుకున్న డాక్టర్ బాబు కల కంటున్నాడా అన్నది సోమవారం తేలుతుంది. ఇక కార్తీకదీపం సీరియల్పై మోహన్ బాబు కూతురు, ప్రముఖ నటి మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు దీప కోసం కన్నీళ్లు కార్చడంతో మా అమ్మ చాలా హ్యాపీగా ఉందని ట్వీట్టర్లో పేర్కొంది.
మంచు లక్ష్మీ ట్వీట్ కు డాక్టర్ బాబు స్పందించి.. థ్యాంక్స్ చెప్పారు. ఐతే నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. మంచు లక్ష్మి వంటలక్క అభిమానిలా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీపక్క చనిపోదని, సీరియల్ అయిపోదని కొందరు అంటుందే, హమ్మయ్య ఇప్పటికైనా శుభం కార్డు వేస్తారా అంటూ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కార్తీక దీపం ఇటీవలే వెయ్యి ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకు వెళ్తోంది.