మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వార్త తెలిసిన వెంటనే మహేష్ బాబు సతీమణి సమ్రత వారి ఇంటికి వెళ్లి పట్టాభి కుటుంబసభ్యులను పరామర్శించారు.
మరణం.. మనిషిని మానసికంగా దెబ్బతీసే ఏకైక విషాద సంఘటన. అయినవారు అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోతే ఆ ఇంటిల్లిపాది పడే మానసిక క్షోభ వర్ణనాతీతం. అందులోనూ ఇంటి పెద్ద దూరమైతే కుటుంబసభ్యులందరూ దుఃఖంలో మునిగిపోతారు. అలాంటి విషాద సంఘటన ఒకటి చోటుచేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ పట్టాభి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పట్టాభి తండ్రి గారు స్వర్గస్తులయ్యారు. ఇది వారి కుటుంబాన్నే కాక, మహేష్ బాబు కుటుంబసభ్యులను విషాదంలో నింపింది.
మహేష్ బాబు వద్ద పట్టాభి ఎప్పటి నుంచో పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మహేష్ బాబు ఫ్యామిలితో ప్రత్యేక అనుభంధం ఉంది. ఇవాళ ఉదయం పట్టాభి తండ్రి గారు వయసు పైబడడంతో అకాలమరణం పొందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మహేష్ బాబు సతీమణి నమ్రత వారింటికి విచ్చేసి.. కుటుంబసభ్యులందరినీ పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుఉన్నారు. మహేష్ బాబు స్పెయిన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
— P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023
మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి. పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి సార్ గారి. వాళ్ళ నాన్నగారు స్వర్గస్తులైనారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. కోరుకుంటున్నాను🙏 ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ🙏 pic.twitter.com/lAOKJBf8WJ
— P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023