సినీ ప్రేక్షకులంతా ఓటిటి సినిమాలకు బాగా అలవాటు అయిపోయారు. ఎప్పుడైతే సినిమాలు నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవ్వడం మొదలైందో.. ఓటిటి సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. అలా డైరెక్ట్ ఓటిటి రిలీజై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలలో 'మా ఊరి పొలిమేర' ఒకటి.
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులంతా ఓటిటి సినిమాలకు బాగా అలవాటు అయిపోయారు. ఇదివరకంటే థియేట్రికల్ సినిమాలే జనాలకు ఏకైక వినోదంగా అనిపించేవి. ఆ సినిమాలే విడుదలైన చాలా కాలానికి ఓటిటి రిలీజ్ అయ్యేవి. కానీ.. ఎప్పుడైతే సినిమాలు నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవ్వడం మొదలైందో.. అప్పటినుండి ఓటిటిలకు డిమాండ్ పెరిగిపోయింది. అలాగే ఓటిటి సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలా పెద్ద హిట్స్ అనిపించుకుని జనాదరణ పొందుతున్నాయి. అలా డైరెక్ట్ ఓటిటి రిలీజై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలలో ‘మా ఊరి పొలిమేర’ ఒకటి.
2021 డిసెంబర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా.. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో రిలీజ్ అయ్యింది. సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య, కామాక్షి, అక్షత శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని డా. అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించారు. అయితే.. మొదటి ప్రయత్నంలోనే సినిమా సూపర్ సక్సెస్ అయ్యేసరికి.. దీనికి సీక్వెల్(మా ఊరి పొలిమేర 2)ని తీసుకొస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సీక్వెల్ కి సంబంధించి షూటింగ్ కూడా ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ ఏరియాలలో సైలెంట్ గా పూర్తి చేశారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. కాగా.. ఈ సినిమాని గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. మరి ‘మా ఊరి పొలిమేర’ సీక్వెల్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.