పైకి గంభీరంగా కనిపించే సినిమా వాళ్ల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇప్పుడున్న స్టార్డమ్ తర్వాత ఉండదు. డబ్బుల విషయంలోనూ ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. హిట్లను బట్టే రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుంది..
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ. సినిమాల హిట్ రేటును బట్టి హీరో, హీరోయిన్ల ఫేట్ మారుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్న స్టార్డమ్ రేపు ఉండదు. హిట్లను బట్టే వారి రేంజ్ క్రియేట్ అవుతుంది. దీన్ని బట్టే ఇండస్ట్రీలో వారి స్థానాన్ని నిర్ణయిస్తారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా వారికున్న హిట్లనే ప్రాతిపదికన తీసుకుంటారు. వరుస హిట్లతో ఉన్న వారికి ఒకలాంటి రెమ్యూనరేషన్ ఉంటే.. ఫెయిల్యూర్లతో ఇబ్బంది పడేవారికి మరోలాంటి రెమ్యూనరేషన్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇది ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే సమస్యే. తాజాగా, ఈ పరిస్థితిని ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఎదుర్కొంటున్నారు. ఆమె ఒకప్పుడు హిట్లతో ఊహించని స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
2021లో వచ్చిన ఉప్పెన ఆమె మొదటి సినిమా. ఈ సినిమా కోసం ఆమె కేవలం 6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్గా తీసుకున్నారు. తర్వాత ఆమె నటించిన రెండో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’కి ఏకంగా 60 లక్షల రూపాయలు తీసుకున్నారు. సినిమాకు సినిమాకు మధ్య రెమ్యూనరేషన్ 10 రెట్లు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణంగా ఉప్పెన సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు సినిమాలు వరుసగా హిట్లు కావటంతో ఆమె తన రెమ్యూనరేషన్ను కోటి రూపాయలకు పెంచేసింది.
అయినా నిర్మాతలు వెనకాడకుండా ఆమెతో సినిమాలు తీయటం మొదలుపెట్టారు. అయితే, ‘వారియర్’ సినిమా తర్వాతినుంచి కృతి శెట్టి ఖాతాలోకి ప్లాపులు రావటం మొదలయ్యాయి. వారియర్తో పాటు మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఆమె రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు వచ్చాయి. కోటి నుంచి మళ్లీ 60 లక్షలకు పడిపోయారు. త్వరలో విడుదల కాబోతున్న ‘కస్టడీ’ సినిమా ఆమె 60 లక్షల రూపాయలు మాత్రమే రెమ్యూరేషన్ తీసుకున్నారట. ప్రసుత్తం ఇది మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరి, కృతి శెట్టి కొత్త కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.