సినీ నటి, రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆస్పత్రి బెడ్ మీద.. నీరసంగా.. చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసింది ఖుష్బు. దసరాకు లేట్గా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించమని కోరింది. అయితే ఖుష్బు చేసిన ట్వీట్, ఫోటో చూసిన అభిమానులు ఆమెకి ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఖుష్బు బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గణనీయంగా బరువు తగ్గారు. అయితే మరి ఆ ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ.. బరువు తగ్గిన తర్వాత ఆమె తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరిన ఫోటోని షేర్ చేశారు.
ఖుష్బు తన ట్విట్టర్లో ‘వెన్నెముక సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ రోజువారీ విధుల్లో పాలుపంచుకుంటాను. లేటుగా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి. అందరికి దసరా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు ఖుష్బు. దీనిలో ఆమె ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా ఖుష్బు ఆరోగ్యంగా ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఆమె తన సోదరుడు అబ్దుల్లా నటించిన సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు ఖుష్బు. ఆ వేడుకలో ఎంతో హుషారుగా కనిపించిన ఆమె.. సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఖుష్బుని నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. వెన్నెముక సమస్య కారణంగా ఖుష్బు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.
Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work.
Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS— KhushbuSundar (@khushsundar) October 5, 2022
ఇక ఖుష్బు చేసిన ట్వీట్ చూసి ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి మేడం.. తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు.. బరువు తగ్గడం మీకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టినట్లుంది… తర్వగా కోలుకొండి.. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఖుష్బు ఆఖరిగా నటించిన చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లు. దీనిలో ఆమె బరువు తగ్గి.. పూర్తిగా కొత్త లుక్లో కనిపించారు. రష్మికకు అమ్మగా కనిపించినప్పటికి.. అక్కగా ఉన్నారు అంటూ ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులు. ఇక కొన్ని రోజుల పాటు జబర్దస్త్ జడ్జీగా కూడా చేశారు ఖుష్బు.