యావత్ దక్షిణాది సినిమారంగంతో పాటు భారతదేశం అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్2. యంగ్ ఆండ్ డైనమిక్ హీరో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ విడుదల ఎప్పుడా అని యష్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన కేజీఎఫ్ కు ఈ చిత్రం సీక్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా కేజీఎఫ్ సినిమాతోనే ఎన్నో రికార్డులు తిరగరాయడంతో కేజీఎఫ్2 కూడా అంతకు మించి ఉండబోతుందన్న కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jr.NTR ని అవమానిస్తూ పవన్ హీరోయిన్ ట్వీట్! ఫ్యాన్స్ ఫైర్!
ఇక ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో దుబాయ్ లో సెన్సార్ షో చూసిన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ‘కేజీఎఫ్ 2’ సినిమాకి రివ్యూ ఇచ్చారు.ఈ సినిమా కేవలం కర్ణాటకలో మాత్రమే బ్లాక్ బస్టర్ కాదని.. ఇదొక వరల్డ్ క్లాస్ సినిమా అని చెప్పుకొచ్చారు ఉమైర్. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని రాసుకొచ్చారు. డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా, ఎఫెక్టివ్ గా ఉన్నాయని తెలిపారు.
ఇక దీంతో పాటు మ్యూజిక్ చాలా బాగుందని ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుందన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని సినిమా మొత్తానికి ఇంటెన్సిటీ చాలా బాగా క్యారీ చేశారని చెప్పారు క్రికటి ఉమైర్ సంధు. ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించించగా సంజయ్ దత్, అధీరాగా పలువురు తమ పాత్రలతో లీనమైన పాత్రలకు ప్రాణం పోశారని తెలిపాడు. కేజీఎఫ్2 మూవీపై ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.