పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలయికలో.. హోంబలేే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’..
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘సలార్’.. KGF తరహాలోనే రెండు భాగాలుగా విడుదల చెయ్యబోతున్నారు. ఫస్ట్ పార్ట్ ‘సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్’ (Salaar Part 1 – Cease Fire) గురువారం (జూలై 6) ఉదయం రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రభాస్ని యాక్షన్ హీరోగా సరికొత్తగా చూపించబోతున్నాడని నీల్ మావ హింట్ ఇచ్చాడు. తన స్టైల్లో హీరో క్యారెక్టర్కు ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చి అదరగొట్టేశాడు. టీజర్లో హీరో క్యారెక్టర్ గురించి చెప్పిన డైలాగులతో సీనియర్ యాక్టర్ టీనూ ఆనంద్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక 24 గంటల్లో KGF 2 రికార్డ్ని బీట్ చేసిన ‘సలార్’ 100 మిలియన్ల మార్క్ కూడా దాటేసింది.
ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలయికలో.. హోంబలేే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’.. శృతి హాసన్ కథానాయిక. జగపతి బాబు, అతని కొడుకుగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. కథలో కీలకమైన పాత్రలు వీరివి. అయితే ముందుగా పృథ్వీరాజ్ పాత్రను ఓ టాలీవుడ్ స్టార్తో చేయించాలనుకున్నాడట ప్రభాస్.
తన బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్ అయితే ఈ పాత్రకు బాగుంటాడని, అతణ్ణి తీసుకొమ్మని దర్శకుడు ప్రశాంత్ నీల్కి చెప్పాడట. ఇద్దరూ తెలుగువాళ్లు అయిపోతారు. మనకి మార్కెట్ వర్కౌట్ కాదు. అని చెప్పాడట. దీంతో డార్లింగ్ కూడా అగ్రీ అయ్యాడట. ప్రభాస్ – గోపిచంద్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ‘వర్షం’ లో విలన్గా నటించినప్పటి నుండి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. బయట కనబడడానికి మొహమాటపడే ప్రభాస్.. గోపిచంద్ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా తప్పకుండా అటెండ్ అవుతుంటాడు.