ప్రశాంత్ నీల్ తో ఏ హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు ఎగిరి గంతులేస్తారు. అలాంటిది చిరంజీవి, ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అంటే పూనకాలు రాకుండా ఉంటాయా? అందులోనూ మల్టీస్టారర్ మూవీ అంటే రోమాలు నిక్కబొడుచుకోకుండా ఉంటాయా? అసలు మల్టీస్టారర్ మూవీ సంగతి ఏంటి? ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ లో నటించే హీరో ఎవరు?
ప్రశాంత్ నీల్ అంటే సినీ జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. హీరో ఎలివేషన్స్ చూపించాలంటే ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. హై వోట్లేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ‘కేజీఎఫ్’ సిరీస్లతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం అయిన ప్రభాస్తో పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ చేస్థున్నాడు. అయితే తాజాగా ఒక వార్త గురించి ఫిల్మ్ నగర్లో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’తో పాటు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్కి పచ్చజెండా ఉపినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ పాన్ ఇండియా మూవీ మరెవరితోనూ కాదు.. మెగాస్టార్ చిరంజీవితోనే అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ మూవీగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
మల్టీస్టారర్ మూవీ అంటే చిరుతో పాటు నటించబోయే ఆ హీరో ఎవరో అన్న ఆసక్తి ఉండడం సహజమే. ఆ హీరో ఎవరో కూడా చిరునే నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తో కూడా చిరంజీవి ఇదే విషయం గురించి చర్చినట్టు వార్తలు వస్తున్నాయి. తన కొడుకు రామ్ చరణ్ తో ఫుల్ లెంత్ రోల్ లో కలిసి నటించాలని కోరిక ఉందని ప్రశాంత్ నీల్ తో చెప్పారట. ఇద్దరికీ సూటయ్యే కథ సిద్ధం చేయమని ప్రశాంత్ నీల్ తో చిరు అన్నారట. గతంలో ఆచార్య సినిమా చేసినప్పటికీ సంతృప్తిలేకపోవడంతో ఈసారి ఎలాగైనా ఇద్దరి కాంబినేషన్ లో సాలిడ్ హిట్ కొట్టాలని భావిస్తున్నారట. కట్ చేస్తే ఇప్పుడు ప్రశాంత్ నీల్తో తన ఆలోచన చెప్పారట. అందుకు తగ్గట్టే మూడు కథలు చెప్పడం కూడా జరిగిందట.
అందులో ఒక కథను చిరంజీవి, చరణ్ ఓకే చేశారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. ప్రశాంత్ నీల్ కూడా చిరంజీవి అభిమానినని గతంలో చెప్పారు. చిరంజీవి సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని చెప్పారు. ఒక అభిమాని అభిమాన హీరోతో సినిమా చేస్తే ఆ అవుట్ పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో బాబీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చిరుతో సినిమా చేస్తే కనుక బాక్సాఫీస్ బద్దలే అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.