‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు.. కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ప్రొడ్యూసర్స్ కి వందల కోట్ల లాభాలు చూపించాయి. ప్రస్తుతం కన్నడలో మాత్రమే సినిమలు తీస్తున్న వీళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అన్ని భాషల్లోనూ మూవీస్ తీద్దామని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే వేల కోట్లు పెట్టి మరీ సినిమాలు తీస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హోంబలే అధినేత విజయ్ ఏం చెప్పారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నేళ్ల ముందు వరకు హోంబలే ఫిల్మ్స్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఎప్పుడైతే ‘కేజీఎఫ్’ రిలీజైందో వీళ్ల పేరు మార్మోగిపోయింది. ఇక ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ చిత్రాలతో వందల కోట్ల లాభాలు చూశారు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో ‘సలార్’ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తీస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ తో మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోలందరితోనూ సినిమాలు తీస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ చెబుతున్నారు. అందుకోసం రూ.3 వేల కోట్లు పెట్టుబడితో రెడీగా ఉన్నామని క్లారిటీ ఇచ్చేశారు.
‘భారత వినోద పరిశ్రమలో వచ్చే ఐదేళ్లపాటు రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నాం. దీని వల్ల ఇండియాలో ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రతి ఏడాది ఓ ఈవెంట్ మూవీతో సహా ఐదారు సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం మేం అన్ని దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సాంస్కృతిక కథల ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్ కు చేరువవ్వాలని ప్రయత్నిస్తాం’అని విజయ్ కిరగందూర్ చెప్పారు. దీన్నిబట్టి చూస్తుంటే.. తెలుగులోనూ ఈ ఐదేళ్లలో ‘కాంతార’ తరహా సినిమాలు వచ్చే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.