కేజీఎఫ్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ 2018లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. రాఖీ భాయ్ గా యశ్ నటన అందరిని ఆశ్చర్య పరించింది. ప్రశాంత్ నీల్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్నింటికీ మించి ఆ ఎలివేషన్ షాట్స్ కేజీఎఫ్ రేంజ్ ని అమాంతం పెంచేశాయి. ఇక ఇప్పుడు కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని ఎట్టి పరిస్థితిల్లో ధియేట్ర్స్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. దీంతో.., కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతుంది.నిజానికి కేజీఎఫ్-2 ఈ జులై 16న విడుదల కావాల్సి ఉంది. అయితే.., కరోనా నేపథ్యంలో అది సాధ్యపడలేదు. కానీ.., ఈ నేపథ్యంలో కేజీఎఫ్-2 ట్విస్ట్ అంటూ ఒక న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
చాప్టర్-1 ముగిసేసరికి కేజీఫ్ రాఖీ భాయ్ చేతిలోకి వచ్చేసింది. గరుడ మరణ వార్త తెలిసి.. ఇప్పుడు దీనిని సొంతం చేసుకోవడానికి చాలా మంది బయలు దేరారు. వీరిలో అధీరా కూడా ఒకడు. ఈ క్యారెక్టర్ ని సంజయ్ దత్ ప్లే చేస్తున్నాడు. సో.., కేజీఎఫ్-2 లో రాఖీ భాయ్, అధీరా పాత్రల మధ్య భీకర పోరు తప్పదని అంతా అనుకుంటున్నారు. అయితే.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.., ఆ అధీరా కొడుకే ఈ రాఖీ భాయ్ అన్న ట్విస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.., ఇదెలా సాధ్యం అంటూ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. దీనికి సమాధానం తెలియాలంటే కాస్త కేజీఎఫ్ కథలోకి వెళ్లాల్సిందే.
రామకృష్ణ పవన్ చిన్న వయసులోనే తండ్రి లేకుండా, కేవలం తల్లి పెంపకంలో పెరిగిన ఓ పిల్లాడు. ఇతను పుట్టింది బెంగుళూరులోనే. తల్లి చనిపోయాక 14 ఏళ్ళ వయసులో ముంబైకి వస్తాడు.కేజీఎఫ్-1 లో ఓ డైలాగ్ ఉంటుంది. “ఆ రోజు ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు” అని. సో.., రామకృష్ణ పవన్ అలియాస్ రాఖీ భాయ్ కి పుట్టకతోనే కేజీఎఫ్ తో సంబధం ఉంది. ఈ లెక్కన రాఖీ భాయ్ తండ్రి కూడా అప్పుడు అదే ప్రాంతంలో ఉన్న కేజీఎఫ్ కోసం ఎందుకు ప్రయత్నించి ఉండకూడదు?
తరువాత కేజీఎఫ్ సూర్య వర్ధన్ కి చిక్కడంతో ప్రాణాలను కాపాడనుకోవడానికి ఎందుకు దూరంగా వెళ్ళిపోయి ఉండకూడదు? అలా దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తే ఈ అధీరా ఎందుకు కాకూడదు? మీరు గమనించారా? కేజీఎఫ్-2లో ఇప్పుడు కేజీఎఫ్ సొంతం చేసుకోవాలనుకునే విలన్స్ అందరికీ ఒక ఐడెంటిటీ ఉంది. ఎలాంటి ఐడెంటిటీ లేకుండా కొత్తగా ఎంట్రీ ఇస్తుంది అధీరా క్యారెక్టర్ మాత్రమే.
ఆ క్యారెక్టర్ కి ఉన్న ఒకే ఒక్క లీడ్.. అతనికి ఎప్పటి నుండో కేజీఎఫ్ మీద చూపు ఉంది అని చెప్పడమే. అది అధీరా గతం ఎందుకు కాకూడదు? నిజానికి అధీరా క్యారెక్టర్ లో ఇంత డెప్త్ లేకుంటే సంజయ్ దత్ లాంటి ఓ పెద్ద స్టార్ ని ఆ పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో.. ప్రశాంత్ నీల్ అధీరా క్యారెక్టర్ కోసం సంజయ్ దత్ నే.. ఏరికోరి తీసుకోవడానికి కారణం ఈ ట్విస్ట్ అనే తెలుస్తోంది. అయితే.., ఈ ట్విస్ట్ ఎంత వరకు నిజమో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.