ఓ వెబ్ సిరీస్ కోసం సదరు లేడీ డైరెక్టర్ అతడ్ని సంప్రదించింది. అందులో అతడ్ని హీరోగా చేస్తానని అంది. తర్వాత మాత్రం అతడ్ని ఇబ్బంది పెట్టే దృశ్యాలలో నటించేలా చేసింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లనుంచి ఆడవాళ్లకు వేధింపులు ఎదురవుతూ ఉంటాయి. నటీమణులు కమిట్మెంట్ కోరటం.. లేదా అలాంటి వీడియోల్లో నటించమని బలవంతం చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ, కేరళలో మాత్రం ఇందుకు భిన్నమైన సంఘటన జరిగింది. ఓ లేడీ డైరెక్టర్ నటుడిపై వేధింపులకు పాల్పడింది. అలాంటి వెబ్ సిరీస్లో నటించాలని అతడ్ని ఇబ్బంది పెట్టింది. చివరకు జైలు పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన లక్ష్మీ దీప ఇప్పుడిప్పుడే దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంటోంది.
ఆమె పలు సినిమాలు తీసింది. ఆమె తీసిన ఓ వెబ్ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించి ఓ నటుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఏకంగా డైరెక్టర్ లక్ష్మీ దీపపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరువనంతపురానికి చెందిన ఆ నటుడు తన ఫిర్యాదులో.. ‘‘ డైరెక్టర్ లక్ష్మీ దీప ఓ వెబ్ సిరీస్ కోసం నన్ను సంప్రదించింది. నన్ను అందులో హీరోగా చేస్తానని అంది. ఆ సిరీస్లో లీడ్ రోల్ ఇస్తానని చెప్పటంతో పాటు.. కొన్ని సీన్లను కూడా నాపై చిత్రీకరించింది. తర్వాత నాతో బలవంతంగా పాడు సీన్లలో నటించేలా చేసింది.
ఆ వెబ్ సిరీస్ షూటింగ్ అరువిక్కురలోని ఓ ఫ్లాట్లో 2022లో చోటుచేసుకుంది. కంట్రాక్ట్ పేరు చెప్పి నాతో బలవంతంగా ఆ సీన్లు చేయించింది’’ అని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, పోలీసులు లక్ష్మీ దీపపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.