మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో తెగ బిజీగా మారాడు. తన సెకండ్ ఇన్నింగ్స్లో వెంట వెంట చిత్రాల్లో నటిస్తూ కాస్త దూకుడు పెంచాడనే చెప్పాలి. ప్రస్తుతం చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చిరుకి జోడిగా నటిస్తోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇక దీంట్లో తనయుడు రామ్ చరణ్ కూడా దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే విడుదల టీజర్తో పాటు ఫోటలతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. చిరంజీవి ఈ సినిమాతో పాటు ఇంకా రెండు మూడు చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక విషయం ఏంటంటే..? ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్టర్గా వేదాళం అనే రీమేక్ సినిమాల్లో నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో చిరుకి చెల్లెలు పాత్ర కోసం టాలీవుడ్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించారట చిత్ర యూనిట్. అందులో సాయిపల్లవి, కీర్తి సురేష్ల పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికి ఇద్దరిలో ముందుగా సాయిపల్లవిని అనుకున్నప్పటికీ చివరికి మాత్రం కీర్తి సురేష్ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మరి దీనికి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది కొన్ని రోజుల్లో తేలనుంది. ఇక ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.