బుల్లితెరపై నవ్వులు పువ్వులు పూయించే ధారావాహిక కపిల్ శర్మ కామెడీ షో. ఈ షో ఎంతటి ఆదరణ చూరగొందే అందరికీ తెలుసు. ఈ కామెడీ షోలో తమ సినిమా ప్రమోషన్ల కోసం కూడా వినియోగించేవారు సినిమా టీమ్. ముఖ్యంగా కపిల్ శర్మ, ఇతరులు చేసే ఫన్నీ స్కిట్స్ కడుపుబ్బా నవ్వించేవి. ఈ షోతోనే కపిల్ శర్మ రేంజ్ మారిపోయిందని చెప్పాలి. ఇందులో అనేక మంది పేరు ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్నారు. వారిలో ఒకరు తీర్థానంద రావు.
బుల్లితెరపై నవ్వులు పువ్వులు పూయించే ధారావాహిక కపిల్ శర్మ కామెడీ షో. ఈ షో ఎంతటి ఆదరణ చూరగొందే అందరికీ తెలుసు. ఈ కామెడీ షోలో తమ సినిమా ప్రమోషన్ల కోసం కూడా వినియోగించేవారు సినిమా టీమ్. ముఖ్యంగా కపిల్ శర్మ, ఇతరులు చేసే ఫన్నీ స్కిట్స్ కడుపుబ్బా నవ్వించేవి. ఈ షోతోనే కపిల్ శర్మ రేంజ్ మారిపోయిందని చెప్పాలి. తొలుత 2013లో కామెడీ నైట్స్ విత్ కపిల్గా ప్రారంభమైంది. అనతికాలంలోనే చాలా ఫేమస్ అయ్యింది. 2016 నుండి ది కపిల్ శర్మ షో తిరిగి ప్రారంభమై.. సక్సెస్ ఫుల్గా కొనసాగుతుంది. ఇందులో అనేక మంది పేరు ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్నారు. వారిలో ఒకరు తీర్థానంద రావు.
కపిల్ శర్మ కామెడీ సర్కస్ కే అజూబ్ కమెడియన్, నటుడు తీర్థానందరావు ఆత్మహత్యకు యత్నించారు. ఫేస్ బుక్ లైవ్లో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. తనను ఓ మహిళ వేధిస్తుందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. ఆ వీడియో పురుగుల మందు గ్లాసులో పోసుకుని తాగినట్లు కనిపిస్తుంది. అతడు మాట్లాడుతూ.. ‘నేను ఒక మహిళతో సహజీవనం చేస్తున్నాను. ఆమె గత సంవత్సరం అక్టోబర్ నుండి తెలుసు. ఈ మహిళ కారణంగా రూ. 3నుండి 4 లక్షల వరకు అప్పులు పాలయ్యా. ఆమె నాపై కేసు కూడా పెట్టిందీ. కానీ కారణం తెలియదు. కలవాలంటూ ఫోన్ చేసి వేధిస్తుందీ’అంటూ ఆవేదన చెందాడు.
తనకేదైనా జరిగితే ఆ మహిళదే బాధ్యత అంటూ పురుగుల మందు తాగాడు. ఫేస్ బుక్ లైవ్ చూస్తున్న తీర్థానందరావు స్నేహితులు.. వెంటనే ఆయన నివాసానికి చేరుకోగా.. అప్పటికే అతడు అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే తీర్థానందరావు లైవ్లో ఆత్మహత్యాయత్నం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. 2021, డిసెంబర్ 27న కూడా తన కష్టాల గురించి చెబుతూ ఆత్మహత్యకు యత్నించారు. అయితే ఇప్పుడు ఆయన ఆసుపత్రి నుండి కోలుకుని, ఇంటికి తిరిగి వచ్చినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.