గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతుంది. ఇప్పటికే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, కమెడియన్ వడివేలు, నటి వరలక్ష్మి శరత్ కుమార్,కీర్తిసురేష్, త్రిష కరోనా భారిన పడగా.. టాలివుడ్ లో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్, మంచు లక్ష్మీ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు.
నటుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కమల్ హాసన్ చేరారన్న వార్తతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ కు తిరిగి రాగానే కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో చెన్నై శ్రీరామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఆయన పూర్తిగా కరోనా నుంచి బయట పడిన తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారు.
ఇది చదవండి : డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు దంపతుల ఘాతుకం!
కమల్ హాసన్ మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే, కమల్ సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడైంది. ఈ సాయంత్రం ఆయనని డిశ్చార్ చేయవొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై మరి కాసేపట్లోనే క్లారిటీ రానుంది. ఏది ఏమైనా మరోసారి కమల్ హాసన్ ఆస్పత్రి లో చేరడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.