Surya: ప్రముఖ సౌత్ హీరో సూర్య ప్రస్తుతం వాడీ వాసల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. వాడీ వాసల్ చిత్రీకరణలో బిజీగా గడుపుతున్న హీరో సూర్య ఖాళీ సమయాన్ని మాత్రం వృధా చేయటం లేదు. తన కుటుంబం కోసం కేటాయిస్తున్నారు. సూర్య తాజాగా, తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వెళ్లారు. ఆ హోటల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. సూర్య, జ్యోతిక వారి ఇద్దరు పిల్లలు కొద్దిరోజుల క్రితం ముంబైలోని బాస్టియనల్ వోర్లీ హోటల్కు వెళ్లారు. బయటకు వచ్చిన వారిని మీడియా ఫొటోగ్రాఫర్లు పలకరిస్తూ.. ఫొటోలు తీయటం మొదలుపెట్టారు.
సూర్య, జ్యోతికలు కూడా ‘హాయ్’ అంటూ ఫొటోగ్రాఫర్లను పలకరించి ఫొటోలకు ఫోజులిచ్చి అక్కడినుంచి కారు దగ్గరకు కదిలారు. అయినప్పటికి ఆ ఫొటోగ్రాఫర్లు ఆగలేదు. వారిని అనుసరిస్తూ ఫొటోలు తీయటం మొదలుపెట్టారు. సూర్య దంపతుల పిల్లల్ని కూడా ఫొటోలు తీయసాగారు. దీంతో పిల్లల ప్రైవసీకి ఆటంకం కలుగుతుందని సూర్య భావించారు. వారి కెమెరాలకు చెయ్యి అడ్డం పెట్టి ‘‘ఫ్లీజ్! మా పిల్లల్ని వదిలేయండి’’ అని అన్నారు. పిల్లలకు అడ్డంగా నిలబడి కారులోకి ఎక్కించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
• @Suriya_offl Anna & #Jyotika Anni With Kids at Mumbai ❤️#Vanangaan #VaadiVaasal#RolexSir #suriya43 pic.twitter.com/JW2OjbWERx
— Aswin Sasi 103 (@NadippinNayak13) August 10, 2022
ఇవి కూడా చదవండి : Kajal Aggarwal: కట్టప్పగా కాజల్ అగర్వాల్.. బాహుబలిగా కుమారుడు నీల్!