సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి పలు సంచలన విషయాలు వెల్లడించారు. దాదాపు 8 నెలల పాటు తనకు స్లో పాయిజన్ ఇచ్చారని తెలిపారు. తాను చావు వరకు వెళ్లి వచ్చానన్నారు.
జేడీ చక్రవర్తి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడి పేరిది. విలన్గా, హీరోగా, సపోర్టింగ్ యాక్టర్గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేశారు. ఆయన తాజా చిత్రం ‘దయ’ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జేడీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. భార్య తనకు స్లో పాయిజన్ పెట్టించిందని తెలిపారు. ఆ విషయంపై జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం బయటకు ఎలా తెలిసిందో నాకు తెలియటం లేదు. ఈ విషయం ఓ ఇద్దరు, ముగ్గురికి మాత్రమే తెలుసు.
ఆ ఇద్దరు, ముగ్గురిలో నేనే ఒకడ్ని. నాకు కొన్ని నెలల క్రితం బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. నాకు బ్రీతింగ్ ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. నేను డ్రగ్స్, సిగరెట్లు కాల్చటం లాంటి అలవాట్లు లేవు. నాకు ఎందుకు రావాలి ఈ ఇష్యూ అని అనుకున్నా. ఓ సమయంలో ఊపిరి తీసుకోవటానికి కూడా కష్టపడ్డాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఉత్తేజ్.. ఓ మంచి డాక్టర్ను పంపించాడు. ఇండియా, శ్రీలంక అన్ని చోట్లా డాక్టర్లను చూసేశాను. పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.
డాక్టర్లు బతకటం కష్టం అని చెప్పేశారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్. వాడు నా చిన్నప్పటినుంచి ఫ్రెండ్. అతడు లాయర్. నన్ను చాలా ఇబ్బందుల్లోనుంచి కాపాడాడు. వీరందరూ చాలా కష్టపడ్డారు. నాగార్జున అనే డాక్టర్ నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన కొన్ని టెస్టులు చేశారు. నాకు గత 8 నెలలుగా స్లో పాయిజన్ ఇస్తున్నారని తేల్చారు. నేను తీసుకుంటున్న కషాయంలో స్లో పాయిజన్ ఉన్నట్లు తెలిసింది. నాకు ఏ అలవాట్లు లేవు గనుక నా బాడీ స్లో పాయిజన్ను రిసీవ్ చేసుకుంది’’ అని చెప్పారు. మరి, భార్య జేడీ చక్రవర్తికి స్లో పాయిజన్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.