శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని, ఓ సినిమాకు కూడా సైన్ చేసిందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదే కాకుండా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న జనగణమన మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధం! స్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్!
ఈ వార్తలపై తాజాగా స్పందించిన జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, నేను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు సైన్ చేయలేదని తెలిపింది. ఒకవేళ తెలుగు సినిమాలో నటిస్తే మాత్రం తప్పకుండా తెలియజేస్తానంటూ జాన్వీ కపూర్ తెలిపింది. దీంతో ఈ హీరోయిన్ ఇప్పట్లో టాలీవుడ్ లో ఎంట్రీ లేనట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.