ఈ మద్య సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏదైనా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటే చాలు వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవల మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ ఈవెంట్ లో భారతీ అనే గ్రామీణ మహిళ పాడిన జానపద గీతం ‘జంపలకిడి జారు మిఠాయా’ ప్రస్తుతం సోషల్ మీడియాని ఓ జానపద గీతం షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడుతూ చిన్నా పెద్దా తెగ సందడి చేస్తున్నారు. దీంతో ఈ పాట పాడిన భారతిపై ట్రోల్స్ మొదలయ్యాయి.
మంచు విష్ణు హీరోగా నటించి ‘జిన్నా’చిత్రంలో జంబలకిడి జారు మిఠాయా జానపద సాంగ్ ని వాడారు. ఇది చిత్తూరు జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో బగా ఫేమస్ అయిన జానపత గీతం. ఇటీవల జిన్నా ఈవెంట్ లో ఒరిజినల్ గా పాడిన సింగర్ భారతిని తీసుకు వచ్చి ఆ పాట పాడిపించారు. భారతి పాడిన జంపలకిడి జారు మిఠాయా పాట పాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రోలర్లు, మీమర్స్ ఆడేసుకున్నారు. యూట్యూబ్ లో వస్తున్న మీమ్స్ కి నెటిజన్లు పగలబడి నవ్వుకున్నారు. జానపద సింగర్స్ పై ట్రోల్స్, మీమ్స్ చేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ పై జారు మిఠాయా సింగర్ భారతి స్పందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.
సింగర్ భారతి మాట్లాడుతూ.. ‘మాది చిత్తూరు జిల్లా పాలవోలు గ్రామం.. ఇక్కడ అనేక జానపద గీతాలు ఎంతో ఫేమస్ అవుతూ వచ్చాయి. నేను పాడిన జంపలకిడి జారు మిఠాయా మోహన్ బాబు విని తనను పాడమని చెప్పారు. ఆ పాట తర్వాత వేరే సింగర్ లో పాడించారు. జిన్నా ఈవెంట్ లో తమను పిలిచి స్టేజ్ పై పాడమని చెప్పారు. మొదటిసారి స్టేజ్ పై మేం పాడిన పాట తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమను ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు.. వారందరికీ ధన్యవాదాలు.. ఎందుకంటే అలా చేయడం వల్లనే నన్ను చాలా మంది గుర్తించారు.. దయచేసి అసభ్యంగా మాత్రం ట్రోల్ చేయవొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సినిమాల్లో పాటలు పాడేందుకు నేను సిద్దంగా ఉన్నాను.. నేను పాటలు కూడా రాయగలను’ అని భారతి తెలిపింది. తనను ట్రోల్ చేస్తున్నప్పటికీ పాజిటీవ్ గా తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.