కరాటే కళ్యాణి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలు మరియు టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. 2020లో టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 4'లో పాల్గొంది. అయితే ఆమె కొన్ని విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉంటారు.
కరాటే కళ్యాణి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలు మరియు టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. 2020లో టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’లో పాల్గొంది. అయితే ఆమె కొన్ని విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉంటారు.
మా అధ్యక్షుడు మంచు విష్ణు, కరాటే కళ్యాణీ మధ్య వివాదం మరింత తీవ్రం అవుతోంది. ఎన్టీఆర్ విగ్రహంకు సంబంధించి తలెత్తిన వివాదం ఇప్పుడు ‘మా’ ఇంట రచ్చ లేపుతోంది. అయితే కరాటే కళ్యాణీ మా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు విష్ణుపై కరాటే కళ్యాణి కయ్యానికి కాలుదువ్వేల చేస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు హాట్ టాపిక్ గా మారింది. దీనికి గల కారణం ఖమ్మం జిల్లాలోని లకారం చెరువు దగ్గర ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో మొదలైన ఎన్టీఆర్ విగ్రహ రూపం వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం హైకోర్టు మెట్లెక్కి విగ్రహానికి మార్పులు చేసేదాకా వెళ్లింది. అంతేకాదు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదంటూ పోరాటం చేసిన కరాటే కల్యాణి. మిగిలిన హీరోల అభిమానులు కూడా ఇదే రీతిలో విగ్రహాలు పెడితే బాగోదు కదా అని కరాటే కళ్యాణి తెలిపింది. ఆదిపురుష్ సినిమా చేశారని ప్రభాస్ విగ్రహాన్ని రాముడి రూపంలో, అన్నమయ్య చేశారని సుమన్ ను వెంకటేశ్వర స్వామి రూపంలో, శివుడు రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అంటూ తనను విమర్షించిన వారిని ప్రశ్నించింది.
తెలుగు జాతి గర్వించ దగ్గ నటుడు, అశేషమైన ప్రేక్షక అభిమానులున్న ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ.. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కరాటే కళ్యాణి పై వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆమె స్పందిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీకోసం తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నానని, అందుకు నాకు గొప్ప బహుమతి లభించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కరాటే కళ్యాణికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ఆయన సూచనలను పెడచెవిన పెట్టారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లనుందో వేచి చూడాల్సిందే.