ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లావుగా ఉన్నా.. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించేవారు. చాలా సంవత్సరాల వరకు కెరీర్ ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.. హీరోయిన్లు ఎంత స్లిమ్ గా ఉంటే.. కెరీర్ అంతగా ముందుకు సాగుతుందన్న పరిస్థితి నెలకొంది.
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు బొద్దుగా ఉన్నా వారి అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేవారు. అప్పట్లో హీరోయిన్లు స్లిమ్ గా ఉంటే పెద్దగా ఆదరించేవారు కారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. హీరోయిన్లు తమ స్టైల్ మార్చారు.. స్లిమ్ గా ఉంటూ జీరో సైజ్ మెయింటేన్ చేస్తున్నారు. ఒకవేళ తెరపై లావుగా కనిపిస్తే.. బండగా, బొద్దుగా తయారైందని ఎగతాలిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం.. కామెంట్స్ చేయడం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీలో నటించిన మాలీవుడ్ బ్యూటీ హనీ రోజ్ ఇలాంటి ట్రోలింగ్స్ కి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
మాలీవుడ్ అందాల భామ హనీ రోజ్ అంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతున్నారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన హనీ రోజ్ కి తెలుగులో మంచి ఆదరణ లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హనీ రోజ్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో చాలా మంది నాపై కుళ్లు జోకులు వేసుకొని నవ్వుకునేవారు.. నా ముందు చాలా అందంగా ఉన్నావంటూనే పక్కకు వెళ్లి నా బాడీషేమింగ్ పై కామెంట్స్ చేసేవారు. కొన్ని ట్రోల్స్ నవ్వులు తెప్పిస్తుంటాయి.. మరికొన్ని మనసు ఎంతగానో నొప్పిస్తుంటాయి. నా శరీరాకృతి గురించి కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తుంటే చాలా బాధ అనిపించేది.. ఇప్పుడు వాటన్నింటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు హనీ రోజ్.
ఇటీవల ఓ టీవీ షో కి వెళ్లాను.. అక్కడ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ వెటకారంగా మాట్లాడారు. అది విని షో యాంకర్ సైతం పగలబడి నవ్వింది.. ఆ యాకంర్ ఓ మహిళ. నా పై చేస్తున్న కామెంట్స్ విని వ్యతిరేకించడం మానేసి నవ్వులు కురిపించడం నాకు అస్సలు నచ్చలేదు.. చాలా బాధ వేసింది. అంతేకాదు ఓ కమెడియన్ నా శరీర భాగాల గురించి ఏదేదో పిచ్చిగా మాట్లాడాడు.. ఇలా బాడీ షేమింగ్ చేస్తు మహిళలను హేళన చేస్తుంటే.. వాటిని టీవీల్లో ప్రసారం ఎలా చేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటే ఆవేదన వ్యక్తం చేసింది నటి హనీ రోజ్. 2005 లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హనీ రోజ్. తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా లో నటించింది.. ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు. బాలయ్యతో నటించిన ‘వీర సింహారెడ్డి’ మూవీతో మంచి గుర్తింపు లభించింది.