ప్రముఖ హాస్యనటుడు కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు.
సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి భర్త చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన వార్త మరచిపోకముందే మరో దుర్వార్త ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీల మరణాలు ఎక్కువయ్యాయి. అందులోనూ.. కమెడియన్స్ ఎక్కువగా చనిపోతున్నారు. అది చిత్ర రంగానికి తీరని లోటు. నిజానికి సినిమా రంగంలో మంచి కామెడీ పండించే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి అరుదైన నటుల్లో ‘కైలాస్ నాథ్’ ఒకరు. మలయాళ చిత్రరంగంలో తనదైన శైలిలో కామెడీని పండించి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు.
1999 కాలంలో సరికొత్త మేనరిజంతో కామెడీ సృష్టించే వారు కైలాస్ నాథ్. ఈయన చేసినవి తక్కువ చిత్రాలే అయినా.. నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. కరోనా తర్వాత ఆయనలో స్పీడ్ తగ్గింది. ఇక ఈ మధ్య తనుకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ చేరిన కైలాస్ నాథ్ గురువారం తుది శ్వాస విడిచారు. కైలాస్ నాథ్ గత కొంత కాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయన లివర్లో కొవ్వు చేరడంతో.. తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయన ఆస్పత్రిలో ఉంటూ.. ఇన్ని రోజులు వైద్యం తీసుకున్నారు. అయితే.. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినా.. కైలాస్ నాథ్ను బ్రతికించలేకపోయారు.
దీంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే.. కైలాస్ చనిపోయాడనే విషయం ప్రముఖ నటి ‘సీమా నాయర్’ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపింది. కాగా.. తన తొలి సినిమా ‘సంఘమ్’ తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు కైలాస్ నాథ్. ‘ఒరు తలై రాగమ్’ యుగపురుషన్, ఏదో ఒరు స్వప్నమ్ వంటి మూవీస్తో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ‘కైలాస్ నాథ్’ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సినీ జనాలు. తన ఆత్మకు శాంతి చేకూరాలని సినిమా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.