సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు పలు కారణాలతో కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో అభిమానులు కలవరపడుతున్నారు. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగాలకు చెందిన వారు పలు కారణాలతో చనిపోతున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్దికీ మంగళవారం కన్నుమూశారు.. ఈ విషాదం నుంచి కోలుకో ముందే.. కొజికోడ్ కి చెందిన బాబీ మోహన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోయి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. సహాయ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ మోహన్ బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 45. కోజికోడ్కు చెందిన బాబీ మోహన్ చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. వాయలార్ మాధవన్ కుట్టి దర్శకత్వం వహించిన టెలివిజన్ సీరియల్ ‘జ్వాలయాయి’కి అసిస్టెంట్ డైరెక్టర్గా మోహన్ పరిశ్రమలోకి ప్రవేశించారు. బుల్లితెరపై పలు సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మలయాళం, తమిళం భాషల్లోని పలు చిత్రాల దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించారు.
సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే బాబీ మోహన్ పలు షార్ట్ ఫిల్మ్లు, ఆల్బమ్లు మరియు ప్రకటనలకు కూడా దర్శకత్వం వహించాడు. అతనికి తల్లి ప్రభ, భార్య నయన, కూతురు ఒలివియా, సోదరి శ్రుతి ఉన్నారు. ఇండస్ట్రీలో బాబీ మోహన్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేవారు కారని.. ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచిస్తూ అందరి మన్ననలు పొందారని సహ దర్శకులు అంటున్నారు. ఆయన మృతిపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు ప్రముఖులు బాబీ మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపారు.