తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు మంచి స్టార్ హోదా సంపాదించారు. సాధారణంగా ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు మితభాషి అంటారు. పెద్దగా ఫంక్షన్లకు కూడా ఆయన హాజరు కారు. అలాంటి రాఘవేంద్రరావుకు కోపం వచ్చింది. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించారు. సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సినిమాలు వరుస విజయాలు అందుకుంటున్నాయని.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాయని అన్నారు. ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాఘవేంద్ర రావు మాట్లాడిన తర్వాత నటి, యాంకర్ అనసూయ మాట్లాడటం మొదలు పెట్టింది. అదే సమయంలో సుడిగాలి సుధీర్ స్టేజ్ మీదకు నావడంతె ఒక్కసారిగా ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్టేజ్ పై ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాఘవేంద్ర రావు మైక్ అందుకొని సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిక పట్టాలని ఆడియన్స్ ని కోరారు.
ఆడియన్స్ మాత్రం రాఘవేంద్రరావు మాట పట్టించుకోకుండా కేకలు, ఈలలు వేయడం తో తీవ్ర అసహనానికి గురైన ఆయన ఏంటీ పిచ్చిపిచ్చిగా ఉందా? అసలు వీళ్లను ఎవరు పిలిచారు? చిన్నా పెద్ద అనే తేడా లేదా? బిహేవియర్ బాగోకపోతే ఇక్కడ నుంచి పంపించేస్తారు.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కామ్ గా ఉండే రాఘవేంద్ర రావు సీరియస్ కావడంతో ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.