ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మింస్తుంటారు. దిల్ రాజుకు కూడా సక్సెస్ రేటు ఎక్కువ. భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు తన కెరీర్లో ఎదుర్కొన్న గెలుపు, ఓటముల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దానిలో భాగంగా తాను ప్రభాస్తో తీసిన ఓ సినిమాలో ముందు రకుల్ ప్రీత్ని హీరోయిన్గా తీసుకున్నామని.. కానీ కొన్ని కారణాల వల్ల తనను తీసేయాల్సి వచ్చిందని.. అందుకు తాను చాలా బాధపడ్డానని వివరించారు. ఆ వివరాలు..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్తో బృందావనం సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీని స్టార్ట్ చేశాం. ఇందులో ప్రభాస్ హీరో అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటి వరకు నాకు నెగిటివ్ రిజల్ట్ ఎదురు కాలేదు. రెండు, మూడు సినిమాలు నేను ఆశించినతం విజయం సాధించలేదు. దాంతో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అలాంటి సమయంలో బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలను స్టార్ట్ చేశాం. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ముందుగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్. ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. ఆ రషెష్ చూశాను. నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది. రకుల్ చాలా సన్నగా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి షూటింగ్ ఆపేశాం. ప్రభాస్కు కూడా విషయం చెప్పాను’’ అని దిల్ రాజు తెలిపారు.
ఇది కూడా చదవండి: హలో గురు ప్రేమ కోసమే.. నిర్మాత దిల్ రాజుకు ఏమైంది..‘‘మరో హీరోయిన్ గురించి నేను, ప్రభాస్, మిగతా టీం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు.. నాకు వెంటనే కాజల్ అగర్వాల్ గుర్తుకు వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభాస్కు చెప్పాను. అందుకు డార్లింగ్.. ఆల్రెడీ తాను కాజల్తో డార్లింగ్ సినిమా చేస్తున్నానని తెలిపాడు. అందుకు నేను డార్లింగ్ స్టోరీ వేరు.. మన కథ వేరు. క్యారెక్టర్స్ వేరు అని.. కొన్ని ఉదాహరణలు చెప్పాను. ప్రభాస్ సరే.. మీ ఇష్టం అన్నాడు. కాజల్ అప్పటికే మా బ్యానర్లో బృందావనం సినిమా చేస్తుంది. ఆమెకు కథ చెప్పగానే విపరీతంగా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంది. అయితే రకుల్ను తీసేసి కాజల్ని తీసుకున్నందుకు నాకు చాలా బాధగా అనిపించింది. అయితే నాకు సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదు. వ్యక్తుల కంటే సినిమానే హిట్ కావాలని చూస్తాను. అందుకే రకుల్ ప్లేస్లో కాజల్ను తీసుకుని సినిమా చేశాం. అటు బృందావనం.. ఇటు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలు రెండూ పెద్ద హిట్ అయ్యాయి’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. దిల్ రాజు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ రేంజ్ స్టార్ ఎవరు లేరు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!