హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో ఆదివారం ‘అలయ్ బలయ్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు విష్ణు కూడా వచ్చారు. కానీ ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇదే విషయం నిన్న ప్రధాన వార్తాంశంగా నిలించింది. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన విభేదాల కారణంగానే ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు ఇద్దరిని సన్మానించిన విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మొదటగా పవన్కళ్యాణ్ను సన్మానించారు. పవన్కు కడుంవా కప్పి, మెమెంటో అందించారు వెంకయ్యనాయుడు. ఆ సమయంలో పవన్ నిల్చునే ఉన్నారు. అనంతరం ‘మా’ అధ్యక్షుడి హోదాలో కార్యక్రమానికి హాజరైన మంచు విష్ణును మాత్రం కూర్చిలో కూర్చోబెట్టి సన్మానించారు. ఇలా సన్మానంలో తేడా ఎందుకనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. కాగా పవన్ను సన్మానించే సమయంలో కూర్చిలో కూర్చోవాలని నిర్వాహకులు కోరినా.. పర్వాలేదు ఇలానే కానివ్వండి అంటూ పవన్ సన్మానం స్వీకరించినట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో పవన్తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించినా కూడా పవన్ పట్టించుకోలేదు.