తెలుగు బుల్లితెరపై అదరగొడుతున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార ఎంట్రీతో మొదలైన ఈ డాన్స్ షో ఎట్టకేలకు అన్ని లెవల్స్ దాటుకొని.. సెమీ ఫైనల్స్ కి చేరుకుంది. ఈ షోని సీరియల్ నటుడు, యాంకర్ అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తుండగా.. నటి సంగీత, బాబా భాస్కర్ మాస్టర్, హీరోయిన్ ఆనంది ఈ డాన్స్ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు ఇప్పుడు సెమీ ఫైనల్స్ కి చేరుకునేసరికి ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ షోని మొదటి నుండి చూస్తున్న ఆడియెన్స్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ఫినాలేకి వెళ్తారని అంటున్నారు. తెలుగు స్టేజ్ పై డాన్స్ షోలలో ఢీ తర్వాత ‘డాన్స్ ఇండియా డాన్స్’ పూర్తిస్థాయిలో డాన్స్ షోగా మొదలైంది.
ఇదిలా ఉండగా.. కొత్తగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. సెమీ ఫైనల్స్ లో పోటీ చాలా గట్టిగానే జరిగినట్లుంది. ఈ క్రమంలో ఢీ షోలో కొరియోగ్రఫీ చేసిన మనోజ్ ఇందులో కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. కాగా.. తన పెర్ఫార్మన్స్ అనంతరం స్టేజ్ పైకి తన తల్లిని పిలిచి.. ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, అమ్మని ఎంతో బాధపెట్టానని భావోద్వేగానికి గురయ్యాడు. “ఫైనల్స్ కి ముందు మా నాన్నకి యాక్సిడెంట్ జరిగి.. కొద్దిగంటల్లో చనిపోతాడని డాక్టర్స్ చేతులెత్తేశారు. అప్పుడు కూడా నన్ను ఫినాలేకి పంపి సపోర్ట్ చేసింది మా అమ్మ” అంటూ ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. మరి మనోజ్ లైఫ్ లో జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.