సినిమా టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ టైంలో టికెట్ రేట్లను పెంచుకునే వీలుగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీవోను జారీ చేసింది. ఈ విషయం పై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు ట్వీట్ చేశారు.
‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్లను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’’ అంటూ.. ట్వీట్తో పాటు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని చిరు ట్విట్టర్లో షేర్ చేశారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు.. మల్టీప్లెక్స్ల్లో రూ.100-250ల మధ్య ఉండాలని.. మల్టీప్లెక్స్ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని తెలుస్తుంది. టికెట్ రేట్స్ పెంచాలని సినీ పరిశ్రమ ఎప్పటి నుండో వెయిట్ చేస్తోంది. టిక్కెట్ ధరల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించగా.. సినీ ప్రముఖులతో చర్చలు జరిపిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా తాజాగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021
అలాగే మెగాస్టార్ చిరు కెసిఆర్ తో పాటు ట్విట్టర్ వేదికగా.. “పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధంచేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి, మంత్రివర్యులు శ్రీ తలసాని యాదవ్ గారికి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరు ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021