రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానులు ఇంకా వాల్తేరు వీరయ్య మేనియా నుంచి బయటకు రాలేదు. ఇప్పటికీ సంక్రాంతి సంబరాలు థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ రారాజు మెగాస్టార్ చిరంజీవి అని మరోసారి రుజువు చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమానులు ఎలా అయితే చిరంజీవిని చూడాలి అనుకుంటారో అలాగే డైరెక్టర్ బాబీ మెగాస్టార్ ను చూపించాడు. కంబ్యాక్ తర్వాత మెగాస్టార్ నుంచి వచ్చిన మాస్ చిత్రం కావడంతో ఫ్యాన్స్ దానిని మెగా మాస్ హిట్టుగా మార్చేశారు.
ప్రస్తుతం వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. పది రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా ప్రకటించారు. రూ.200 కోట్ల కలెక్షన్స్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాబీ మరోసారి వింటేజ్ చిరంజీవిని పరిచయం చేశాడంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమా రిలీజ్ తర్వాతి నుంచి ఇలా కదా మెగాస్టార్ ని చూడాలనుకునేది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Megastar’s ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥
Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥
– https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3— Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023
డైరెక్టర్ బాబీకి ఇది లైవ్ టైమ్ హిట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిజం, కామెడీ టైమింగ్, ఫైట్స్ లో ఆయన స్వాగ్ అంతా అప్పటి మెగాస్టార్ నే చూసినట్లుందని మురిసిపోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో రవితేజ కూడా తమ్ముడు పాత్ర చేయడంతో ఇది మాస్ హిట్టు కాదు.. మెగా మాస్ హిట్టుగా నిలిచిందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఒక అభిమాని తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాబీ కళ్లకు కట్టినట్లు చూపించాడంటున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరడంపై మీ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.