లైగర్.. ఈ సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ బజ్ అంతా ఇంతా కాదు. సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. సినిమా ఆగస్టు 25న విడుదల కావడం ఆ తర్వాత మిక్స్ డ్ టాక్తో మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా అయితే ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. గతంలో సినిమా ప్రమోషన్స్ లో బృందం చెప్పిన మాటలు, వారి స్టేట్మెంట్లను బయటకు తీసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. చార్మీ విషయంలో అయితే ఆమె చేసిన ఓ ట్వీట్ని ఇప్పటికీ తిప్పి తిప్పి నానా యాగి చేస్తున్నారు. ఈ విషయంలో చార్మీ చాలా విసిగిపోయినట్లు తెలుస్తోంది.
నెటిజన్స్, ట్రోలర్స్ దెబ్బకు విసిగిపోయిన చార్మీ ఓ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ట్రోలర్స్ కు సమాధానం చెబుతూనే తన నిర్ణయం కూడా ప్రకటించింది. ఆ ట్వీట్ చూసి అంతా షాకవుతున్నారు. చార్మీ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని. విషయం ఏంటంటే.. ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ తో విసిగిపోయిన చార్మీ ఇంక కొన్నాళ్లు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అదే విషయాన్ని వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేసింది. కొంత బ్రేక్ తిరిగి రెట్టించింన ఉత్సాహంతో వస్తామంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బతకండి.. బతకనివ్వండి అంటూ గట్టిగానే కౌంటర్ వేసింది.
చార్మీ ఏమని ట్వీట్ చేసిందంటే.. “చిల్ గాయ్స్, కాస్త సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. తప్పకుండా రెట్టించిన ఉత్సాహంతో తిరిగొస్తాం. అప్పటివరకు బతకండి, బతకనివ్వండి” అంటూ చార్మీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఆ ట్వీట్కి సైతం కామెంట్స్ లో నెగెటివ్గానే స్పందిస్తున్నారు. కొందరైతే పూరీ-విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించడం మొదలు పెట్టారు. జేజీఎం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. అందుకు నెటిజన్స్ ఆ సినిమా మూలన పెట్టేశారు అంటూ సమాధానాలు చెబుతున్నారు. చార్మీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022