ఇండస్ట్రీలో ప్రకటించిన సినిమాలన్నీ తెరమీదకు రాకపోవచ్చు. ఒక్కోసారి కొన్ని అనౌన్స్ మెంట్ వద్దే ఆగిపోతుంటాయి.. మరికొన్ని షూటింగ్ ప్రారంభించే ముందు, ఇంకొన్నింటికీ స్క్రిప్ట్ దశలోనే బ్రేక్ పడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే.. అనౌన్స్ మెంట్ తర్వాత తెరమీదకు రావాల్సిన సినిమాలు ఎప్పుడు ఆగిపోయాయి? అని కాకుండా ఎందుకు ఆగిపోయాయి? అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' మూవీ విషయంలో ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు టాలీవుడ్ లో ఏ రేంజి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు రాసి, తీసే దమ్మున్న డైరెక్టర్ అని ఇదివరకే ప్రూవ్ చేసుకున్నారు. అయితే.. కొన్నేళ్లుగా సరైన మాసివ్ హిట్ కోసం ట్రై చేస్తున్న పూరి.. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండను పాన్ ఇండియాకు పరిచయం చేస్తూ 'లైగర్' అనే సినిమా తీశాడు. ఇక బాక్సాఫీస్ వద్ద లైగర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. కలెక్షన్స్ పరంగా లైగర్ నష్టాలు మిగిల్చిందని టాక్. దీంతో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి 'జనగణమన' మూవీకి బ్రేక్ పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ మేకింగ్ దశలో ఉన్నప్పుడే పూరి.. జనగణమన మూవీని విజయ్ దేవరకొండతోనే ప్రకటించాడు. అదికూడా 2023లో రిలీజ్ కాబోతుందని హింట్ ఇచ్చారు. కానీ.. తాజాగా లైగర్ సినిమా ఫలితం చూసి జనగణమన మూవీకి కావాల్సిన బడ్జెట్ ఎక్కువని.. అది ఇప్పుడు రిస్క్ అని భావించి ప్రస్తుతానికి బ్రేక్ వేశారట పూరి, విజయ్. ఇక తదుపరి సినిమాగా పూరి 'ఇస్మార్ట్ శంకర్ 2'ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడని టాక్. మరోవైపు విజయ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. పూరి స్క్రిప్ట్ సిద్ధం చేసేలోపు అటు రామ్.. బోయపాటితో పాన్ ఇండియా మూవీ ఫినిష్ చేసి ప్రాజెక్ట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీవర్గాలు. ఆ తర్వాతే పూరి, విజయ్ కాంబినేషన్ లో 'జనగణమన' స్క్రిప్ట్ తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి పూరి, విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన 'జనగణమన' మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #JanaGanaMana - SHELVED pic.twitter.com/CLREZiTyYl — Aakashavaani (@TheAakashavaani) September 3, 2022