దేశ వ్యాప్తంగా అయ్యప్పస్వామిని ఎంతో భక్తి భావంతో కొలుస్తారు. అయ్యప్ప మాలను ధరించిన భక్తులు ఎంతో నియమ నిష్ఠతో ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, శర్వానంద్, మంచు మనోజ్ మరికొంత మంది ప్రముఖులు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే.
ఇది చదవండి : అఖండ మూవీకి OTT షాక్.. సందిగ్ధంలో మేకర్స్!
అయ్యప్పను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు 41 రోజుల పాటు చేపట్టే ఈ దీక్ష చివరగా కేరళలో ఉన్న శబరిమల దేవస్థానంలో దేవుడిని దర్శించుకున్న తరువాత ముగుస్తుంది. అయ్యప్ప స్వామి మహిమ బాలీవుడ్ కి కూడా విస్తరించింది. తాజాగా అయ్యప్ప మాల బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ వేసుకున్నారు.
దక్షిణాది జ్యోతిష్కుడు బాలు మున్నంగి వల్లే ఆయన మాల వేసుకున్నారు. గురుస్వామి వెంకటరెడ్డి ముంబైకి వెళ్లి అజయ్ దేవగణ్ తో మాలధారణ చేయించారు. తాజాగా అయ్యప్ప మాల ధరించిన అజయ్ దేవగణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.