దక్షిణాది వెండితెరను ఏలిన దివంగత ప్రముఖ నటి శ్రీ దేవి. చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా పేరుగాంచి వెండితెరపై చెరగని ముద్ర వేసింది. భాషలతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది ఈ అతిలోక సుందరి. అలా ఉన్నట్టుండి మరణించి సినీ ప్రేక్షకులకు తీరని లోటును మిగిల్చి పోయింది. ఇక తల్లి మరణానంతరం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక బాలీవుడ్ లోకి దఢక్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ హీరోయిన్. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకోవటం విశేషం. చిన్న వయసులోనే నటిగా మారిన జాన్వీ కపూర్ తన నటనతో తల్లి పేరును నిలబెడుతోంది. చేసినవి తక్కువ చిత్రాలే అయినా నటనలో తన కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంటోంది. దఢక్ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, రూహి వంటి చిత్రాల్లో జాన్వీ నటించింది. నటనతోనే కాకూండా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక లాక్ డౌన్ కారణంగా సినిమాలు వాయిదా పడటంతో మరిన్ని అవకాశాలను అందుకునేందుకు కొత్త ప్రయోగాన్ని అరంభించింది. వరుస ఫోటో షూట్ లతో కుర్రకారును మత్తెక్కించే పనిలో పడింది ఈ అందాల భామా. తాజాగా ఇన్స్టా గ్రామ్ వేదికగా తన అందాల అరబోతకు శ్రీకారం చుట్టింది. ఇటీవల క్లివేజ్ దుస్తువుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందులో జాన్వీ కపూర్ తన లేలేత అందాలను అరబోస్తూ యువతను తన వైపు తిప్పుకుంటోంది ఈ జూనియర్ అతిలోక సుందరి. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ దోస్తానా, గుడ్ లక్ జెర్రీ అనే సినిమాల్లో నటిస్తోంది.