సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇండస్ట్రీ ఇప్పటికీ తీసుకోలేకపోతుంది. స్టార్ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయన, ఇక లేరు అనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక కృష్ణని చివరి సారి చూసేందుకు పద్మాలయా స్టూడియోస్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. అయితే జగన్ తోపాటు బాలయ్య వచ్చిన సమయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే. సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలో అజాతశత్రువు. ఆయన అందరితోనూ సత్సంబంధాలు మెంటైన్ చేసేవారు. అందుకే ప్రతి ఒక్క హీరో కూడా ఆయన్ని అభిమానించేవారు. అలానే కాంగ్రెస్ తరఫున ఎంపీగానూ చేసిన కృష్ణ.. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ క్రమంలోనే కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు హీరో బాలకృష్ణ, కుటుంబ సమేతంగా వచ్చారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళి అర్పించారు.
ఇక బాలయ్య వచ్చిన కాసేపటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పించి, ఆయన కుమారుడు మహేశ్ తో మాట్లాడారు. కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక మహేశ్ వెనక నిల్చుని ఉన్న బాలయ్యకి జగన్ నమస్కరించారు. ఆ తర్వాత జగన్-బాలయ్య కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య-జగన్ ఇలా ఓ చోట కలవడం వాళ్ల అభిమానులకు కనుల పండగలా మారింది.