నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. జనవరి 12 నుంచి అభిమానులతో పాటు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయనుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన బాలయ్య.. #NBK108 పేరుతో తీస్తున్న మరో సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. రీసెంట్ గానే చిత్రీకరణ ప్రారంభం కాగా.. ఇప్పుడు మూవీ టీమ్ కు ప్రమాదం జరిగింది. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘వీరసింహారెడ్డి’ని సంక్రాంతి బరిలో నిలబెట్టిన బాలయ్య, ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ యాక్షన్ కామెడీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఓ వారం క్రితమే ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు కొందరు ఆర్టిస్టులు వ్యాన్ లో బయలుదేరారు. అయితే ప్రగతినగర్ చెరువు దగ్గర, వేకువజామున వ్యాన్ కు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి పంపించి చికిత్స అందించారు. ప్రస్తుతం క్షతగాత్రులంతా క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.