ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ షో.. పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ కి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన పార్ట్ 1 ప్రోమోను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీతో ఎపిసోడ్ ప్రారంభం అవ్వగా.. బాలకృష్ణ పవన్ ను ఉద్దేశించి ‘ఈశ్వరా పవనేశ్వరా’ అంటూ జపించారు. ఇక పవన్.. ‘నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు’ అంటూ బాలకృష్ణ డైలాగ్ ని అందుకున్నారు. ఆ డైలాగ్ చెప్పగానే బాలకృష్ణ ఓ అంటూ అరిచారు.
గుడుంబా శంకర్ ప్యాంట్ గురించి, మొట్టమొదటిసారిగా ఇద్దరూ కలిసిన సందర్భం గురించి ప్రస్తావించిన విషయాన్ని ప్రోమోలో చూపించారు. సుస్వాగతం సినిమా ఓపెనింగ్ అప్పుడు బాలకృష్ణ, పవన్ ను కలిసిన సందర్భాన్ని ప్రోమోలో గుర్తుచేశారు. ఇక బాలకృష్ణ.. ప్రశ్నల ఘట్టంలోకి అడుగుపెట్టి.. పవన్ ని ప్రశ్నలు అడిగేశారు. తివిక్రమ్ తో స్నేహం, రామ్ చరణ్ తో సాన్నిహిత్యం ఎలా కుదిరిందని ప్రశ్నించారు. దీనికి పవన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను పెళ్లిళ్ల గురించి అడిగేశారు. ‘ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అంటూ బాలకృష్ణ పవన్ ని ప్రశ్నించారు. ‘వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి.. విజ్ఞత, సంస్కారంతో మాట్లాడకుండా ఆపేస్తున్నాయి’ అంటూ సమాధానమిచ్చారు పవన్.
ఇంత మానసిక సంఘర్షణకి గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఒక సందర్భంలో చిరంజీవి గదిలోకి వెళ్లి తుపాకీ తీసుకుని’ అంటూ ప్రోమోలో సస్పెన్స్ ని మెయింటెయిన్ చేశారు. ఈ మొత్తం ప్రోమోలో పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన మాత్రం బాగా హైలైట్ అయ్యింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అని విమర్శించే వాళ్లకి ఈ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారేమో అన్న క్యూరియాసిటీ అయితే ఫ్యాన్స్ లోనూ, ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ ప్రోమోపై మీ అభిప్రాయం ఏమిటి? బాలకృష్ణను, పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.