తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల గురించి రోజుకొక వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా స్టార్ హీరోల నుంచి కిందిస్థాయి హీరోల వరకూ అందరూ వరుస వివాదాల్లో నలిగిపోతూ సరిగ్గా మాట్లాడుకోరని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. చిరంజీవికి బాలకృష్ణకు పడదని లేక ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒకరినొకరు సరిగ్గా మాట్లాడు కోరని చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు.
ఇలా వచ్చే ట్రోల్స్ పై తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందించారు. ఆహాలో వస్తున్న ఆన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షోకి బాలకృష్ణ హాస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ ట్రోలర్స్ కు మాస్ వార్నింగ్ ఇస్తూ.. ప్రపంచంలోని ప్రతివాడు తమకు ఏది అనిపిస్తే అది సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారని, పేరు లేని, లొకేషన్ లేని అడ్రస్ లతో ఇర్రెస్పాన్స్ బులిటీగా బీహేవ్ చేస్తున్నారని అన్నారు.
రవితేజకి బాలకృష్ణ పడదని, చిరంజీవి బాలకృష్ణ ఫోన్ లో మాట్లాడుకోరని, నా హీరో తోపు నీ హీరో సోపు ఏంటి ఇవన్నీ అంటూ ట్రోలర్స్ ని ప్రశ్నించారు. లెప్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని.. దొరికితే దవడ పగిలిపొద్ది అంటూ బాలకృష్ణ ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ మనం చేయాల్సింది ఒకటేనని, ఊరు, పేరు చెప్పుకోలేని ధైర్యం లేని ఈ వేదవలను క్షమిద్దామని బాలకృష్ణ అన్నారు. ఇక దీంతో పాటు మనమీద వచ్చిన విమర్శలని ప్రేమించినప్పుడే మనం ఆన్ స్టాపబుల్ అవుతామని బాలకృష్ణ సూచించారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. హీరోలపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చిన బాలయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.