టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తను పేరు రావడంపై బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి సీరియస్ అయ్యారు. నిజానిజాలు ఏంటో సమయం వచ్చినప్పుడు వాళ్లకు మాత్రమే చెబుతానన్నారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు డ్రగ్స్ కేసు అలజడి రేపుతోంది. ఈ కేసు విచారణలో ‘కబాలి’ మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరీ నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు ఫేమస్ పొలిటీషియన్స్ కుమారులకు కూడా డ్రగ్స్ ఇచ్చినట్లు ఇన్వెస్టిగేషన్లో కేపీ చౌదరి అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో సెలబ్రిటీ అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. బిగ్బాస్ బ్యూటీ అషురెడ్డితో కేపీ చౌదరి కొన్ని వందల సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు డేటాలో తేలిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా అషురెడ్డి స్పందించారు. తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను అషు తీవ్రంగా ఖండించారు.
కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నట్లు తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని అషురెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇవి తప్పుడు వార్తలని పేర్కొన్న ఆమె.. సమయం, అవసరం వచ్చినప్పుడు సంబంధింత అధికారులకు నిజానిజాలు ఏమిటో పూర్తిగా వివరిస్తానని స్పష్టం చేశారు. తన పర్మిషన్ లేకుండా తన ఫోన్ నంబర్ను బహిరంగంగా ప్రదర్శిస్తే అస్సలు సహించేది లేదంటూ ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్ ద్వారా ఈ మేరకు ఆమె ఒక పోస్ట్ చేశారు. ఇకపోతే, టాలీవుడ్లో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి కాల్ లిస్టును పోలీసులు డీకోడ్ చేశారని సమాచారం. దీంతో అషురెడ్డి పేరు తెరమీదకు వచ్చిందని తెలుస్తోంది. అషురెడ్డితో పాటు తెలుగు మూవీస్లో కొన్ని ఐటెం సాంగ్స్ చేసిన ఒక నటి సహా మొత్తం 12 మంది పేర్లు కేపీ చౌదరి చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో తదుపరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అషురెడ్డికి పోలీసులు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అషురెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.