అషూ రెడ్డి నటిగా కన్నా కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, స్కిన్ షోలతో వార్తల్లో నిలుస్తుంటారు. నటిగా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ..బిగ్ బాస్ 3తో ఆమె ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జూనియర్ సమంత.. మరోసారి యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఈ అందాల భామ.. వైజాగ్, అరకులోయ వంటి అందమైన ప్రాంతాలను చుట్టి వచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా అప్ లోడ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఓ ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టాప్ టూ బాటమ్ బ్లాక్ జంప్ షూట్ డ్రెస్ను ధరించి నుంచున్న ఈ బ్యూటీ.. వెనుక నుండి తీసిన ఫోటోను షేర్ చేస్తూ ‘జనాలకు నా బ్యాక్ అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్లు నా వెనుకే మాట్లాడుకుంటారు’ అంటూ కామెంట్ చేసింది. ఈ టైట్ డ్రెస్లో కుర్రకారుకు అందాల కనువిందు చేసింది. అరకు లోయ ఫోటోలను షేర్ చేస్తూ అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నదీ అంటూ రాసుకొచ్చారు. వీటితో పాటు నాటు కోళ్ల ఫామ్ హౌస్కు వెళ్లిన ఫోటోలను సైతం తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది. ఎల్లో డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోంది.
రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన అషూ, ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమౌతున్న బీబీ జోడి అనే డాన్స్ షోలో మెహబూబా పక్కన కనిపించిన అషూ, తర్వాత కొన్ని కారణాలతో బయటకు వచ్చేసింది. ఇప్పుడు సినిమాలపై కూడా దృష్టి సారించింది. ‘పద్మవ్యూహం చక్రదరికే తెలుసు అనే సినిమాలో పద్మ అనే క్యారెక్టరో కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కడప, పులివెందులలో జరిగింది. అదే కాక ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలోనూ కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆద్య అనే క్యారెక్టర్లో నటిస్తోంది. తాజాగా పెట్టిన ఫోటోలపై పలువురు పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేసి.. మీ అభిప్రాాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.