సంకల్ప బలముంటే ఏదైనా సాధించొచ్చు. ఇదే రీతిలో కొంతమంది మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం లాంటి రంగాల్లో రాణిస్తూ విజేతలుగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహిళలు వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తూ దూసుకెళ్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని అసాద్యాలను సుసాధ్యం చేస్తున్నారు. మహిళలు తమకు తామే పోటీ అన్న రీతిలో వినూత్నంగా ఆలోచించి ఎంట్రప్రెన్యూర్లుగా మారుతున్నారు. వ్యాపారవేత్తలుగా మారి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇదే విషయానికి చెందిన ఓ మహిళ ఉన్నత చదువులు చదివింది, ఆ తర్వాత ప్రముఖ కంపెనీలల్లో ఉద్యోగం కూడా చేసింది. కానీ అవేమీ తనకు సంతృప్తినివ్వలేదు. దీనికి గల కారణం తనకు వ్యాపారవేత్తగా రాణించాలనేది ఆమె కల. ఇంతకీ ఆమె ఎలా వ్యాపారంలోకి అడుగుపెట్టింది? ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన శ్రీదేవి, సూర్యనారాయణ దంపతుల కూతురు మాలినీ ఆదపురెడ్డి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వైద్యులే. కాగా మాలినీ ఆదపురెడ్డి ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ లో, ఇతర సంస్థల్లో కూడా ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కు వెళ్లి ఎంబీఏ పూర్తి చేసింది. బిజినెస్ చేయడమే తన లక్ష్యం కాబట్టి ఫ్రాన్స్ నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. తన ఆలోచనను తల్లిదండ్రులతో చెప్పగా వారు ఓకె చెప్పడంతో బ్యూటీ రంగాన్ని ఎంచుకున్నానని తెలిపింది. దీనిలో భాగంగానే 2020లో ‘డీకన్స్ట్రక్ట్’ వెబ్ సైట్ ప్రారంభించానని తెలిపింది. ఈ రోజుల్లో కొందరు తమ ఆరోగ్య సమస్యలకు వైద్య నిపుణులను సంప్రదించకుండా నెట్ లో సెర్చ్ చేసి తమకు అనువైన వైద్య సదుపాయాలను ఎంచుకుకుంటున్నారు. అలాంటి వారికోసం ఇన్ స్టా గ్రామ్ ద్వారా చర్మ సమస్యలకు సంబంధించిన మెడిసిన్ ల సమాచారాన్ని ఇవ్వడం మొదలు పెట్టామని మాలినీ తెలిపింది.
దీంతో పాటు వారు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను కూడా ఇన్ స్టాలో పరిచయం చేశామని మాలిని తెలిపింది. దీంతో 2021లో క్రీములు, సీరమ్, షాంపూ మార్కెట్లోకి విడుదల చేస్తే నెల వ్యవధిలోనే రూ. 10 లక్షల వ్యాపారం జరిగిందని తెలిపింది. వెబ్ సైట్ ప్రారంభించి దాని ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపింది. వ్యాపారం ఆరంభించిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది. ఈ క్రమంలో రూ. 3.5 కోట్ల వెంచర్ క్యాపిటల్ అందింది. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదని వెల్లడించింది. ఇంట్లో ఫ్రారంభమైన సంస్థ మూడు వేర్ హౌస్ లు, 50 మంది ఉద్యోగులు, ఐదు ఫ్యాక్టరీల నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నామని మాలిని తెలిపింది. పోయిన సంవత్సరం కలరి క్యాపిటల్ నుంచి రూ. 20 కోట్ల పెట్టుబడి వచ్చిందని, ప్రస్తుతం వ్యాపారం రూ. 60 కోట్లకు చేరిందని తెలిపింది. భవిష్యత్ లో తమ ఉత్పత్తులను విదేశాల్లో కూడా విక్రయించేందుకు ఆలోచిస్తున్నట్లు మాలిని తెలిపింది. దీనంతటికి కారణం తల్లిదండ్రుల ప్రోత్సాహం, భర్త తోడ్పాటు అని మాలిని తెలిపింది.