ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. థియేటర్లలోకి వెళ్లి చూడాలన్నా సరే.. ప్రేక్షకులు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కావాలని అంటున్నారు. అలా ఉంటేనే వెళ్తున్నారు. స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఉన్నాడా అనే విషయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుందా అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలా ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ లాంటి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల కోట్ల వసూళ్లు అంటే ఏంటే చూపించాయి. ఇప్పుడు ఇదే సినిమాలపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలోని చాలా తక్కువ మంది స్టార్స్ మాత్రమే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అలాంటి వ్యాఖ్యలే చేశాడు.ఏ విషయాన్ని అయినా సరే నిర్మొహమాటంగా చెప్పేసే ఆయన… కొన్నిసార్లు తన కామెంట్స్ తో కాంట్రవర్సీల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. ఇకపోతే పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత బాలీవుడ్ కు అస్సలు కలిసి రావడం లేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కావట్లేదు. అన్ని కూడా వచ్చినవి వచ్చినట్లే ఫెయిలవుతున్నాయి. అదే టైంలో దక్షిణాది సినిమాలో నార్త్ లో వందల కోట్ల కలెక్షన్స్ తో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
‘ప్రస్తుతం దేశ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ పై దర్శకనిర్మాతలు దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ ని పూర్తిగా నాశనం చేస్తోందని నా అభిప్రాయం. చెప్పాలంటే హిందీలో పాన్ ఇండియా సినిమాల ప్రస్తావన ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే నార్త్ లోనూ అలాంటి మూవీస్ తీయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాలీవుడ్ తనను తాను నాశనం చేసుకుంటోంది. పుష్ప, కాంతార, కేజీఎఫ్ 2 సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ అయ్యిండొచ్చు. కానీ అలాంటి వాటిని బాలీవుడ్ లో కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలు తీయాలని చూస్తే మాత్రం భారీ నష్టం తప్పదు. ఇప్పుడు బాలీవుడ్ కు కావాల్సింది పాన్ ఇండియా మూవీస్ కాదు. ఇండస్ట్రీకి ధైర్యాన్ని సినిమాలు. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా దీనిపై దృష్టిపెట్టాలి’ అని స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చెప్పాడు. ఇదిలా ఉండగా అనురాగ్ తీసిన ‘దొబారా’ మూవీ.. ఈ ఏడాది రిలీజై భారీ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ మాల్యా లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ‘ఫైల్ నం.323’ సినిమా చేస్తున్నాడు.