ప్రస్తుతం సోషల్ మీడియా అంతా క్రిస్మస్ వేడుకల ఫోటోలతో నిండిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలు. క్రిస్మస్ కు ముందు రోజే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోట చేరి సీక్రెట్ శాంటా గేమ్ ను ఆడిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కజిన్స్ అందరు క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను అఖిల్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు హీరో అడవి శేష్.
సెలబ్రిటీస్ ఏ చిన్న వేడుకలు నిర్వహించినా గానీ ఫ్యామిలీ మెుత్తం ఓ చోట చేరుతుంది. క్రిస్మస్ కు ఓ రోజు ముందే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోటచేరి సీక్రెట్ శాంట గేమ్ ఆడిన ఫోటోలను సోషల్ మీడియాలో మెగా కోడలు ఉపాసన షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ సైతం కజిన్స్ తో కలిసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కజిన్స్ అందరు పాల్గొన్నారు. హీరో అఖిల్, సుమంత్ లతో పాటుగా మరికొంత మంది అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఆడపడుచులు పాల్గొనగా.. నాగచైతన్య ఈ వేడుకలో కనిపించలేదు.
ఇక ఈ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు హీరో అడవి శేష్. అక్కినేని కజిన్స్ అని అడవి శేష్ కూడా ఉండటంతో అభిమానుల్లో పలు ఆసక్తికరమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి.”అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రేమ, సంతోషంతో అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు హీరో అఖిల్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని కజిన్స్ పార్టీలో అడవి శేష్ ఎందుకు ఉన్నాడు? త్వరలోనే ఏదైనా న్యూస్ వినబోతున్నామా? అంటూ ఈ పిక్ చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అడవి శేష్ కూడా మీ పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాక్స్ అఖిల్ బ్రో అంటూ రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.