Aishwarya Rajesh: తెలుగు అమ్మాయి అయినప్పటికి తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు ఐశ్వర్య రాజేష్. ప్రముఖ సీనియర్ హాస్య నటి శ్రీ లక్ష్మి మేనకోడలే ఐశ్వర్య. ఆమె తండ్రి కూడా తెలుగులో హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఆమె చిన్నతనంలోనే ఆయన అనారోగ్యంతో మరణించారు. తండ్రి మరణం తర్వాత ఐశ్వర్య రాజేష్ కుటుంబం ఎన్నో కష్టాలను చవిచూసింది. ఐశ్వర్య ఎంతో కష్టపడి తన కెరీర్ను బిల్డ్ చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు, పేరు తెచ్చుకోవటానికి కూడా ఎంతో కష్టడారామె. ఆడపిల్లలకు ఏదీ అంత ఈజీగా దొరకదని, అందుకోసం చాలా కష్టాలు, ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆమె తరుచూ అంటూ ఉంటారు. మహిళలకు ఏదైనా సమస్య వచ్చినపుడు సీరియస్గా స్పందిస్తారు.
తాజాగా, చెన్నైలో చోటుచేసుకున్న ఊబర్ ఆటో డ్రైవర్ ఘటనపై ఆమె స్పందించారు. సదరు ఆటో డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం ఈ ఘటనపై ట్విటర్ ఖాతాలో.. ‘‘అలాంటి వెధవలను వెంటనే కఠినంగా శిక్షించాలి. అతడిపై చర్యలు తీసుకున్నందుకు సంతోషం. ఇషితా సింగ్ నువ్వు ధైర్యంగా ఉండు’’ అని పేర్కొన్నారు. కాగా, ఇషితా సింగ్ అనే యువతి తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఏసీజే ఇండియా కాలేజ్లో జర్నలిజం చదువుతోంది. కొద్దిరోజుల క్రితం ఆమె ఈస్ట్ కోస్ట్ మద్రాస్నుంచి ఐబిస్ ఓఎమ్ఆర్ హోటల్కు రావటానికి తన స్నేహితురాలితో కలిసి ఊబర్ ఆటో ఎక్కింది.
ఆటో ఐబిస్ ఓఎమ్ఆర్ హోటల్ దగ్గరకు రాగానే ఇషిత స్నేహితురాలు డబ్బులు చెల్లించటానికి కిందకు దిగింది. ఆమె వెనకాలే ఇషితా కూడా దిగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఆటో డ్రైవర్ సెల్వమ్ ఇషితాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె రొమ్ము భాగాన్ని తాకాడు. దీంతో బాధితురాలు ఆటో డ్రైవర్పై విరుచుకుపడింది. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని చూసింది. అయితే, అతడు అక్కడినుంచి పారిపోయాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ అరగంట తర్వాత పోలీసులు హోటల్ దగ్గరకు వచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మంగళవారం అతడ్ని అరెస్ట్ చేశారు.
Such idiots needs to be punished immediately… am glad actions were taken… and u stay strong girl 💪 https://t.co/rIrmBxRNfr
— aishwarya rajesh (@aishu_dil) September 27, 2022