సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు.. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే తమ సత్తా చాటుతు స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది.
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల వారసులు హీరోలు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అతి కొద్దిమంది మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరో, విలన్ గా నటించిన రాజేశ్ కూతురు నటి ఐశ్వర్య రాజేశ్ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగుతుంది. ఈమె మేనత్త టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీలక్ష్మి. తమిళనాట సన్ టీవిలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. 2011 లో అవగాళమ్ ఇవర్గలం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది మంచి పేరు సంపాదించింది. తాజాగా ఐశ్వర్య రాజేశ్ ‘పుష్ప’ మూవీలోని రష్మిక పాత్రపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
నటి ఐశ్వర్య రాజేశ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య రాజేశ్ నటించిన ఫర్హాన మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప మూవీలోని శ్రీవల్లి క్యారెక్టర్ తనకైతే భలే సెట్ అయిఉండేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ‘పుష్ప’పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాలో పాటలు, డైలాగులు ఇప్పటికీ అనుకరిస్తూనే ఉన్నారు. నటి ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం.. తెలుగు మూవీస్ లో చేసి నా కుటుంబం గర్వపడేలా చేయాలని అనుకునేదాన్ని.. ఆ కోరిక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తో తీరింది. ఆ తర్వాత టక్ జగదీశ్, రిపబ్లిక్, కౌసల్య కృష్ణమూర్తి మూవీలో నటించారు.
తెలుగు లో నాకు సరైన అవకాశాలు రావడం లేదు.. నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. నాకు ‘పుష్ప’ మూవీలో శ్రీవల్లి లాంటి డీ గ్లామర్ పాత్రలు బాగా సూట్ అవుతాయి.. ఆ పాత్ర నాకు వచ్చి ఉంటే తప్పకుండా చేసేదాన్ని.. అంటే ఆమె బాగా చేయలేదని నా అభిప్రాయం కాదు.. నేను అయితే ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయి ఉండేదాన్ని అని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్య రాజేశ్. ప్రేక్షకులను అలరించడానికి.. నాకుమంచిగా అనిపించిన ఏ పాత్ర అయినా చేసి మెప్పిస్తాను. తెలుగు ప్రేక్షకులు సినిమా కాన్సెప్ట్ బాగుంటే ఎలాంటి చిత్రాలైనా ఆదరిస్తారు. సినిమా బాగుందని టాక్ వస్తే చాలు.. వాళ్లే బ్లాక్ బస్టర్ చేస్తారు. ఇంత గొప్ప ప్రేమాభిమానాలు ఏ పరిశ్రమలో చూడలేదు అన్నారు. నేను చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగు వారి ప్రేమను ఎంతోగొప్పగా పొందుతున్నాను’అని అన్నారు.