మీడియాను చూడగానే సిద్ధార్థ్ తన నడక వేగాన్ని పెంచారు. చెకింగ్ దగ్గరకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరీలు రిలేషన్లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఏదో ఒక చోట ఇద్దరూ జంటగా దర్శనమిస్తూనే ఉన్నారు. తాజాగా, వీరిద్దరూ ముంబై ఎయిర్పోర్టులో జంటగా దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. సిద్ధార్థ్ మాస్క్ ధరించి ఉన్నాడు. లగేజీ ట్రాలీని తోసుకుంటూ ఆయన చెకింగ్ దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆయన వెనకాల అదితీ వస్తూ ఉన్నారు. సిద్ధార్థ్ చెకింగ్ దగ్గరకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీయటం మొదలుపెట్టారు.
దీంతో సిద్ధార్థ్ కొంత అన్కంఫర్టబుల్గా ఫీలయ్యారు. వెంటనే ట్రాలీని వేగంగా తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. వెనకాల వచ్చిన అదితీ మాత్రం ఫొటోగ్రాఫర్ల దగ్గరకు రాగానే ఆగిపోయారు. నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం చెకింగ్ దగ్గరకు వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ మీడియాను చూస్తే సిద్ధార్థ్కు ఎందుకంత భయం’’..‘‘ సిద్ధార్థ్కంటే అదితీనే ధైర్యవంతురాలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సిద్ధార్థ్, అదితీ రావు ‘ మహా సముద్రం’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే, తమ ప్రేమ వ్యవహారంపై ఇరు వర్గాల నుంచి ఎటువంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. త్వరలో అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అది ఎప్పుడు అన్న దానిపై కూడా క్లారిటీ లేదు. మరి, మీడియాను చూసి హీరో సిద్ధార్థ్ నడక వేగం పెంచటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.