నేచురల్ స్టార్ నాని, ‘రాజారాణీ’ ఫేమ్ నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం” అంటే..సుందరానికీ”. నవీన్ యెర్నేని, రవిశంకర్ లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ నజ్రీయ.. తన గురించి, ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. కుల, మతాంతార పెళ్లిల విషయంలో మన పిల్లల తరానికైన సమస్య ఉండకూడదని ఈ సందర్భంగా నజ్రియా తెలిపారు.
హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ…” నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నేను చెైల్డ్ ఆరిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టాను. టీవీలోని పలు షో యాంకర్ గా చేశాను. రెండేళ్లు వరుసగా సౌత్ ఇండియాలో పలు సినిమాలు చేశాను. అనంతరం ఫాహద్ ఫాజిల్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చాను. ‘అంటే..సుందరానికీ’ కథ ఆసక్తిగా అనిపించడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ చిత్రంలో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఇది నాకు తొలి డైరెక్ట్ ఫిల్మ్.
ఇదీ చదవండి: అనుపమ పరమేశ్వరన్ క్రేజ్.. ఆమె కోసం థియేటర్ మొత్తం బ్లాక్ చేసిన డైరెక్టర్!
తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను” అని నజ్రియా పేర్కొన్నారు. మతాంతర వివాహాల గురించి నజ్రియా మాట్లాడుతూ.. కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పదని, కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉందని, మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నానట్లు నజ్రియా అన్నారు. మరి.. ఈ బ్యూటీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.