టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాతా సోషల్ మీడియా యూజ్ చేస్తూ చాలామంది పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నయని పావని ఒకరు. ఇన్ స్టా యూజర్స్, ‘ఢీ’ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె.. చాలా వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసింది. అయితే యాక్టర్ గా కంటే ఇన్ఫ్లూయెన్సర్ గానే బాగా పేరు తెచ్చుకుంది. రీల్స్, వీడియోలు చేసే ఈమె.. ఎక్కువగా శ్వేతానాయుడుతో కనిపిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి ‘ఢీ’ డ్యాన్స్ షో గత సీజన్ లో టీమ్ లీడర్స్ గా చేశారు. వీళ్లతో కలిసి హైపర్ ఆది బాగానే ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు. అలాంటి నయని పావని ఇంట్లో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసుకుంది.
ఇక విషయానికొస్తే.. హైదరాబాద్ లో ఉంటున్న నయని పావని.. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి లాంటి షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. ఇవన్నీ తనకు ఎంతలా ఉపయోగపడ్డాయో తెలియదు గానీ ‘ఢీ’ షోలో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ గా చేసిన తర్వాత మాత్రం పావని కాస్త పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే పలు ప్రమోషన్స్ చేస్తూ బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉన్నాసరే రీల్స్ తో పాటు అప్పుడప్పుడు ఫ్యామిలీ గురించి కూడా చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నాన్న చనిపోయారని చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘ఒక జన్మలో 100 జన్మలకు ప్రేమందించావ్ కానీ సరిపోలేదు నాకు ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ నవ్వు ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు? ఇంక ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావ్ అనుకున్నా కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్. 2023లో నేను అస్సలు ఎంటర్ కావాలని అనుకోవట్లేదు’ అని పావని తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.