కరాటే కల్యాణి తనకు ప్రాణ హాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు.
నటి కరాటే కల్యాణి మరో సారి వార్తల్లో నిలిచారు. తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కరాటే కల్యాణి మాట్లాడుతూ.. ‘‘ నాకు ప్రాణ హాని ఉంది. ఈ మధ్యనే నా కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారు. నేను ఈ మధ్యన హిందుత్వ వాదులతో కలసి కార్లో ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే నా కార్ లో వెళ్లా. అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నపుడు నా కార్ టైర్ పేలిపోయింది.
వాస్తవానికి ఆ టైరు ఏ హైవే మీద వెళ్తున్నపుడో పేలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ కార్ టైరు చూసిన మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని చెప్పారు. నా మీద కోపం తోనే ఎవరో కావాలని అలా చేశారు. నాకు ప్రాణ హాని ఉంది’’ అని అన్నారు. కాగా, కరాటే కల్యాణి ఖమ్మంలో కృష్ణుడి రూపంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ ఎన్టీఆర్ చాలా చిత్రాల్లో నటించారు. ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించారు.
అలాగని అన్ని పాత్రలతో, అన్ని వేషాలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామా? కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం చూస్తే.. పిల్లలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకుంటారు. కచ్చితంగా ఆ విగ్రహ ఏర్పాటు ఆపాలి. మేము అడ్డుకుంటాం’’ అన్నారు. దీంతో పెద్ద రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించారు. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. మరి, తనకు ప్రాణహాని ఉందంటున్న కరాటే కల్యాణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.