తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా పేర్లే ఇంటిపేర్లుగా మార్చుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది స్వాతి. స్వాతి అంటే మీకు తెలియకపోవచ్చు.. కలర్స్ స్వాతి అంటే వెంటనే మీ కళ్ల ముందు మెదులుతుంది. మాటీవీలో ప్రసారం అయిన కలర్స్ అనే టీవీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. దాంతో ఆ ప్రోగ్రామ్ పేరే తన ఇంటిపేరుగా మారింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో తెలుగు పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ అమ్మడు.. తాజాగా నవీన్ చంద్ర నటించిన అమ్ము సినిమాను చూశానని, ఈ మూవీలో నవీన్ చంద్ర శాడిస్ట్ పాత్ర చూసి షాకయ్యనంటూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కలర్స్ స్వాతి.. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అనంతరం హీరో నాని నటించిన అష్టాచమ్మా మూవీతో పెద్ద హిట్ అందుకుంది. దాంతో స్వాతికి వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. ఈక్రమంలోనే కొన్నిసినిమాల్లో హీరోయిన్ చెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. స్వామిరారా, కార్తికేయ లాంటి మూవీలతో హిట్ సినిమాల హీరోయిన్ గా మారిపోయింది. 2018లో వికాస్ వాసు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం క్రమంగా సినిమాలకు దూరం అయ్యింది. అయితే తాజాగా హీరో నవీన్ చంద్ర, ఐశ్వర్యలక్ష్మీ జంటగా నటించిన ‘అమ్ము’ సినిమాను చూసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర, అమ్ము.. సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్వాతి..”నవీన్ చంద్ర తెలుగు ఇండస్ట్రీకి దొరికిన జెమ్. అమ్ము లో నవీన్ పోషించిన శాడిస్ట్ పాత్రను చూసి షాక్ కు గురైయ్యాను. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్, BGM కథకు సూపర్ గా సెట్ అయ్యాయి. ఈ సినిమా చూస్తుంటే.. ఇంటర్వెల్ టైమ్ లో నవీన్ చంద్ర నా దగ్గరకు వచ్చాడు. నేను తనతో మాట్లాడలేదు. నాతో మాటకలిపే ప్రయత్నం చేయగా.. నాతో మాట్లాడకు, ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తనమీద సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. పాపం నవీన్ ఫీల్ అయినట్టున్నాడని” స్వాతి చెప్పుకొచ్చింది. ఇక కలర్స్ స్వాతి చాలా గ్యాప్ తర్వాత ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. మరో మూవీ పంచతంత్రం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. గతంలో నవీన్ చంద్ర, స్వాతి.. త్రిపుర అనే థ్రిల్లర్ మూవీలో కలిసిన నటించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. దాంతోనే ఈ అమ్మడు అతడిపై చిరు కోపాన్ని ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.